Ashwin: అతడు సెలెక్షన్ గురించి పట్టించుకోడు.. పరుగులు చేయడమే తెలుసు: అశ్విన్
టీమ్ఇండియా (Team India) జట్టులోకి వచ్చేందుకు విపరీతమైన పోటీ ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తారు. దేశవాళీలో అదరగొడితే జాతీయ జట్టులో స్థానం వస్తుందనే ఆశతో చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశవాళీ క్రికెట్లో భారీగా పరుగులు సాధిస్తూ.. జాతీయ జట్టులోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్న క్రికెటర్లలో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) ముందు వరుసలో ఉన్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. కానీ, ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు మాత్రం జట్టులో ఎంపిక కాలేకపోయాడు. ఎప్పట్నుంచో వేచి ఉన్న సూర్యకుమార్ యాదవ్కు (Surya kumar Yadav) అవకాశం వచ్చింది. కాస్త లావుగా ఉన్నాడనే కారణంతోనే ఇలా పక్కన పెట్టారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపించాయి. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాజూగ్గా ఉండాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లి మోడల్స్ను తీసుకొచ్చి బ్యాటింగ్, బౌలింగ్ నేర్పించమని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలెక్టర్ శ్రీధరన్ శరత్ కీలక ప్రకటన విడుదల చేశారు. తమ దృష్టిలో సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడని, జట్టులో సమతూకం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి నిర్ణయం తీసుకొంటామని వెల్లడించారు. ఈ క్రమంలో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) కూడా సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఫామ్ను అభినందించాడు.
‘‘సర్ఫరాజ్ ఖాన్ గురించి చెప్పడానికి ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే అతడు జట్టులోకి సెలెక్ట్ అవుతాడా..? లేదా..? అనే విషయంపై చర్చ జరిగింది. అయితే అతడేమీ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా తన పనేదో చేసుకుంటూ పోతున్నాడు. 2019-20 దేశవాళీ సీజన్లో 900 పరుగులు, 2020-21 సీజన్లో కూడా దాదాపు వెయ్యి పరుగులు సాధించాడు. ఈ సీజన్లోనూ ఇప్పటి వరకు 600 రన్స్ చేశాడు. అతడి సూపర్ ప్రదర్శనతో తన ఉద్దేశం ఏంటో చాటి చెప్పాడు. సర్ఫరాజ్ కేవలం సెలెక్షన్ కమిటీ తలుపులను మాత్రమే బాదలేదు. అందులోని సభ్యులను కూడా దహించివేసేలా చేశాడు. దురదృష్టవశాత్తూ అతడు ఎంపిక కాలేకపోయాడు. అతడు సెలెక్ట్ కాకపోయినా.. ముంబయి తరఫున దిల్లీ మీద భారీ ఇన్నింగ్స్ ఆడాడు’’ అని అశ్విన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.