టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని ఆవిష్కరించిన జై షా 

 వచ్చేనెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌ ట్రోఫీని బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆవిష్కరించారు. జట్టు వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సెప్టెంబరు 10 తుది గడువుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది.

Published : 03 Sep 2021 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్కు: వచ్చేనెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌ ట్రోఫీని బీసీసీఐ సెక్రెటరీ జై షా ఆవిష్కరించారు. జట్టు వివరాలను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలు సమర్పించేందుకు సెప్టెంబరు 10 తుది గడువుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఆలోపు అంటే సెప్టెంబరు 6 లేదా 7వ తేదీల్లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుదిజట్టును ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ తుది జట్టును ఎంపిక చేయనుంది. అక్గోబరు 17న ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది ఆటగాళ్లు, 8 మంది సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఈసారి యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఒమన్‌ దేశాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని