ఓటమిపై సాకులు వద్దు.. పున:సమీక్షించండి
ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్ బిషన్ బేడి తీవ్రంగా స్పందించారు. ఎస్జీ బంతి, పిచ్, టాస్...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమిపాలవ్వడంపై మాజీ క్రికెటర్ బిషన్సింగ్ బేడి తీవ్రంగా స్పందించారు. ఎస్జీ బంతి, పిచ్, టాస్ వంటి కారణాలు చెప్పకుండా ఓటమిపై పునఃసమీక్షించాలని టీమిండియాకు సూచించారు. ‘‘నిన్న మ్యాచ్ను చూడలేకపోయాను. అయితే విజయం అందుకోవడంలో ఇరు జట్లకూ అవకాశముంటుంది. కానీ ఎస్జీ బంతి, వికెట్, టాస్ వంటి సాకులు చెప్పకూడదు. ఇంగ్లాండ్ జట్టును అభినందించినట్లుగానే ఓటమిపై పునఃసమీక్షించుకోవాలి. ప్రత్యర్థి జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు’’ అని బేడీ ట్వీట్ చేశారు.
చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఎస్జీ బంతులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి నాణ్యత సంతృప్తికరంగా లేదు, గతంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నామని అన్నాడు. మ్యాచ్లో టాస్ కీలకమే కానీ, ఇంగ్లాండ్ ఘనతను ఏమాత్రం తగ్గించాలనుకోట్లేదని పేర్కొన్నాడు. ఓటమిపై సాకులు చెప్పమని, జట్టు వైఫల్యాల్ని అంగీకరిస్తున్నామని తెలిపాడు. కాగా, చెన్నైలోనే శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sai Dharam Tej: మీరు వారిని గౌరవించినప్పుడే నా పెళ్లి: సాయి ధరమ్తేజ్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Civil Service: మోదీజీ.. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు ఒక్క అవకాశమివ్వండి
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!
-
India News
NEET PG exam: నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో మార్పు వార్తల్ని నమ్మొద్దు: కేంద్రం
-
General News
APSRTC: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ