Ashwin: అశ్విన్ స్థానంలో ఎవరు..? టీమ్ఇండియా 10మందితోనే ఆడాలా?
IND vs ENG Third Test: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి అశ్విన్ దూరమవడంతో అతడి స్థానం ఎవరిని తీసుకుంటారన్న చర్చ మొదలైంది. మరి దీనిపై ఐసీసీ రూల్స్ ఎలా ఉన్నాయి?
ఇంటర్నెట్ డెస్క్: టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా అరుదైన ఘనత సాధించిన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. ఆ ఫీట్ అనంతరం కొన్ని గంటలకే జట్టు నుంచి దూరమయ్యాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు (IND vs ENG Third Test) నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. దీంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి అశ్విన్ స్థానంలో మరొకరిని తీసుకునే అవకాశం ఉందా? లేదా టీమ్ఇండియా (Team India) 10 మంది ఆటగాళ్లతోనే ఆడాలా?
రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
క్రికెట్ నిబంధనల ప్రకారం ఒక ప్లేయర్ ఆట మధ్యలో గాయపడినా లేదా అనారోగ్యానికి గురైనా సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను తీసుకునేందుకు అంపైర్ అనుమతినిస్తాడు. ఇవి కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ‘ఆమోదయోగ్యమైన కారణం’తోనూ జట్టు సబ్స్టిట్యూట్ ప్లేయర్ను తీసుకోవచ్చు. అప్పుడు ప్రత్యర్థి జట్టు కెప్టెన్ నుంచి సమ్మతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సబ్స్టిట్యూట్గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. బౌలింగ్, బ్యాటింగ్కు అనుమతి లేదు. అంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేయొచ్చు.
టీమ్ఇండియాకు షాక్.. మూడో టెస్టు నుంచి వైదొలిగిన అశ్విన్
ఇక్కడ అశ్విన్ గాయపడలేదు, అనారోగ్యానికి గురికాలేదు. అత్యవసర పరిస్థితుల్లో జట్టును వీడటంతో.. టీమ్ఇండియా ఇప్పుడు బెన్ స్టోక్స్ అనుమతితో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను పెట్టుకోవచ్చు. ఈ అవకాశంతో ప్రస్తుతానికి రోహిత్ సేన దేవదూత్ పడిక్కల్ను తీసుకుంది. అయితే, అతడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. కంకషన్ సబ్స్టిట్యూట్కు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది.
కంకషన్కు అవకాశం ఉందా?
నిబంధనల ప్రకారం.. ఓ ఆటగాడు ఆన్ ఫీల్డ్లో గాయపడి మ్యాచ్ మొత్తానికి దూరమైతే అప్పుడు అతడి స్థానంలో కొత్త ప్లేయర్ను కంకషన్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ, అశ్విన్ అలా వెళ్లలేదు కాబట్టి.. భారత జట్టుకు ఆ అవకాశం లేదు. కానీ, ఇంగ్లాండ్ బోర్డుకు భారత్ అధికారికంగా అభ్యర్థన చేసుకుంటే, బెన్ స్టోక్స్ సమ్మతిస్తే.. వాషింగ్టన్ సుందర్ లేదా అక్షర్ పటేల్ను భారత్ తీసుకునేందుకు ఛాన్సుంది. అశ్విన్ దూరమవడంతో ప్రస్తుతం టీమ్ఇండియాకు ఫుల్టైమ్ బౌలర్లు నలుగురే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!