Chess Olympiad: చెస్ ఒలింపియాడ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు
తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్లో ‘భారత బీ టీమ్’ మంగళవారం ఓపెన్ సెలెక్షన్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది...
(Photo: International Chess Federation Twitter)
మమల్లపురం: తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్లో చివరిరోజు భారత్కు రెండు కాంస్య పతకాలు దక్కాయి. ఓపెన్ సెక్షన్లో ‘ఇండియా బీ టీమ్’ తొలుత కాంస్యం సాధించగా కాసేపటికే.. మహిళల సెక్షన్లోనూ ‘ఇండియా ఏ టీమ్’ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతోనే మెరిసింది. దీంతో భారత్కు ఈరోజు రెండు పతకాలు సొంతమయ్యాయి. ఫైనల్ రౌండ్లో భాగంగా ఓపెన్ సెక్షన్లో కొద్దిసేపటి క్రితం జర్మనీతో తలపడిన మ్యాచ్లో ‘ఇండియా బీ టీమ్’ 3-1 తేడాతో గెలిచింది. మరోవైపు ఇదే విభాగంలో ఉజ్బెకిస్థాన్ స్వర్ణం సాధించడం విశేషం. ఆ జట్టు నెదర్లాండ్స్తో తలపడిన పోరులో 2-1 తేడాతో గెలిచింది. ఇక స్పెయిన్తో తలపడిన మరో మ్యాచ్లో ఆర్మేనియన్ టీమ్ 2.5-1.5 తేడాతో విజయం సాధించి రజతం కైవసం చేసుకుంది. మొత్తంగా ఉజ్బెకిస్థాన్ 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 19 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
మరోవైపు మహిళల సెక్షన్లో టాప్ సీడ్ అయిన ‘ఇండియా ఏ టీమ్’ ఫైనల్ రౌండ్లో అమెరికాను ఓడించి పసిడి ముద్దాడుతుందని ఆశించగా నిరాశ ఎదురైంది. అమెరికా 3-1 తేడాతో ‘ఇండియా ఏ టీమ్’ను ఓడించింది. ఈ జట్టుకు కోనేరు హంపి నాయకత్వం వహించడం గమనార్హం. మరోవైపు మహిళల విభాగంలో ఉక్రెయిన్.. జార్జియాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఓపెన్ సెలెక్షన్ విభాగంలో ‘ఇండియా బీ టీమ్’ మొత్తంగా 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్