S Sreesanth : తొమ్మిదేళ్ల తర్వాత శ్రీశాంత్కు తొలి ఫస్ట్క్లాస్ వికెట్
టీమ్ఇండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ....
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వెటరన్ పేస్ బౌలర్ శ్రీశాంత్కు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి వికెట్ దక్కింది. 2013లో ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్తో శ్రీశాంత్ జీవితకాలం నిషేధానికి గురైన విషయం తెలిసిందే. వివిధ విభాగాల్లో అప్పీలు చేసుకోగా శిక్ష ఏడేళ్లకు తగ్గింది. ఎట్టకేలకు 2020 సెప్టెంబర్ నాటికి శ్రీశాంత్ నిషేధం పూర్తి చేసుకున్నాడు. అప్పటి నుంచి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలోనూ రూ. 50 లక్షల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నా ఫలితం దక్కలేదు. ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే కేరళ తరఫున రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం మాత్రం వచ్చింది.
మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 11.5 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను శ్రీశాంత్ తీశాడు. తొలుత మేఘాలయ బ్యాటర్ ఆర్యన్ బోరా వికెట్ పడగొట్టిన ఆనందంలో పిచ్కు విభిన్నంగా అభివాదం చేశాడు. దానికి సంబంధించిన వీడియోను తాజాగా ట్విటర్లో షేర్ చేశాడు. ‘‘దేవుడి దయతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత నాకు తొలి వికెట్ దక్కింది. అందుకే పిచ్ మీద సాష్టాంగ ప్రణామం చేశా’’ అని శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ 505/9 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. అనంతరం మేఘాలయ మొదటి ఇన్నింగ్స్లో 148/10, రెండో ఇన్నింగ్స్లో191/10 కుప్పకూలింది. దీంతో కేరళ 166 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లోనూ శ్రీశాంత్ 19 పరుగులు చేశాడు. అయితే ఆర్యన్ బోరా బౌలింగ్లోనే శ్రీశాంత్ ఔట్ కావడం గమనార్హం.
టీమ్ఇండియా తరఫున శ్రీశాంత్ 2011లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్లో భాగంగా ఆగస్టు 18 నుంచి 22 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు వికెట్ల నష్టానికి 591 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. బౌలర్లలో శ్రీశాంత్ (3/123) ఒక్కడే మూడు వికెట్లను పడగొట్టి ఫర్వాలేదనిపించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో చివరిసారిగా ఇయాన్ మోర్గాన్ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో 283 పరుగులే చేయగలిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.