Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్కు నో ఛాన్స్
ప్రపంచకప్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే తమ ఇళ్లకు చేరుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఐపీఎల్-16 సీజన్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఆర్సీబీ శిబిరంలో చేరిపోయాడు. మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్.. దాదాపు రెండు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాదే ప్రపంచకప్ కూడా జరగనుండటంతో కీలక ఆటగాళ్ల పనిభార నిర్వహణపై టీమ్ఇండియా దృష్టిపెట్టింది. ఈ విషయంలో ఫ్రాంచైజీలకు సూచనలు చేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రధాన ఆటగాళ్లను కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంచేలా బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే ఆటగాడి పేరుని దినేశ్ కార్తిక్ వెల్లడించాడు. అయితే.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రాలలో ఒక్కరి పేరును కూడా డీకే చెప్పలేదు. ఇంతకీ దినేశ్ కార్తిక్ చెప్పిన ఆటగాడు ఎవరో తెలుసా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య.
‘టీమ్ఇండియా లైనప్లో హార్దిక్ పాండ్య నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన ఆటగాడు. ఎందుకంటే అతడు బ్యాటింగ్, బౌలింగ్లో రాణించగలడు. మీడియం పేసర్గా ఉంటూ బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఉండటం చాలా కష్టం. జట్టులో ఇద్దరు, ముగ్గురు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లను పొందడం చాలా కష్టం. హార్దిక్ మిడిల్ ఆర్డర్లో బాగా బ్యాటింగ్ చేస్తాడు. బౌలింగ్ విషయానికొస్తే వికెట్లు రాబట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నట్లు కనిపిస్తోంది. అతడు బౌలింగ్ చేసే విధానం గమనిస్తే ఎప్పుడూ షార్ట్ బంతుల కోసం ప్రయత్నిస్తాడు. కానీ ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేయడం ఎప్పుడైతే ప్రారంభించాడో బ్యాటర్ తన భారమంతా బ్యాక్ ఫుట్పై పెట్టి షార్ట్ బంతుల కోసం చూస్తుంటాడు. ఆ సమయంలో నిదానంగా ఆడేందుకు ప్రయత్నిస్తాడు. హార్దిక్ పాండ్య టీమ్ఇండియాకు కీలకం. అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే దానిపై జట్టు నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఫామ్లో ఉంటే హార్దిక్ టీమ్ఇండియాకు కీలక ఆటగాడు’ అని డీకే వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.