Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
ఐసీసీ (ICC) ర్యాంకుల్లో ముందంజలో ఉన్నామని సంబరపడిపోతున్న భారత ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) నెగ్గాలంటే ర్యాంకులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్లతో పాటు జట్టు కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ముంగిట ఇలా ర్యాంకుల్లో ముందంజలో ఉంటే టీమ్ఇండియా ఆటగాళ్లలో తప్పకుండా ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే, భారత మాజీ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) మాత్రం ఇలాంటి ర్యాంకులు మెగా టోర్నీలో అవసరం లేదని.. బలమైన జట్లను ఓడిస్తేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి జట్టును ఓడించాలని సూచించాడు. గతంలో భారత్ ప్రపంచకప్లను గెలిచిన సందర్భాలనూ గంభీర్ ఉదహరించాడు.
‘‘వరల్డ్ కప్ను నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగితే మాత్రం ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించాల్సిందే. ఆ జట్టు మెగా టోర్నీల్లో అత్యంత బలమైంది. మేం 2007 టీ20 ప్రపంచ కప్లో ఆసీస్ను సెమీస్లో ఓడించాం. అప్పుడు విజేతగా నిలిచాం. ఆ తర్వాత 2011లోనూ క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ను మట్టికరిపించాం. రెండోసారి వన్డే ప్రపంచకప్ ఛాంపియన్గా అవతరించాం. ఐసీసీ టోర్నీల్లో ఏదొక దశలో ఆసీస్ను భారత్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆసీస్పై గెలిస్తే దాదాపు కప్ను సొంతం చేసుకున్నట్లే. అందుకే, వరల్డ్ కప్లో ర్యాంకింగ్కు సంబంధమే లేదు.
మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ ఆధిపత్యం
ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. మెగా టోర్నీల్లో ఆ జట్టుతో గట్టి పోటీ ఉంటుంది. ఆటగాళ్లు కూడా అంతే పట్టుదలతో ఆడతారు. టీమ్ఇండియా గత రెండు వరల్డ్ కప్ (టీ20, వన్డే) టోర్నీల్లో విజేతగా నిలిచిందంటే దానికి కారణం ఆసీస్ను నాకౌట్ దశలో ఓడించడమే. అలాగే 2015 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఒకవేళ అక్కడా గెలిచి ఉంటే ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఎక్కువ. ఈసారి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ ఆసీస్తోనే జరగనుంది. ఇందులో గెలిస్తే తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే, మనకు తొలి మ్యాచ్ చాలా కీలకం’’ అని గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో