Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
ఐసీసీ (ICC) ర్యాంకుల్లో ముందంజలో ఉన్నామని సంబరపడిపోతున్న భారత ఆటగాళ్లకు గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశాడు. వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) నెగ్గాలంటే ర్యాంకులు ముఖ్యం కాదని వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ (ICC) ర్యాంకుల్లో భారత్ ఆటగాళ్లతో పాటు జట్టు కూడా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2023) ముంగిట ఇలా ర్యాంకుల్లో ముందంజలో ఉంటే టీమ్ఇండియా ఆటగాళ్లలో తప్పకుండా ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు. అయితే, భారత మాజీ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) మాత్రం ఇలాంటి ర్యాంకులు మెగా టోర్నీలో అవసరం లేదని.. బలమైన జట్లను ఓడిస్తేనే విజేతగా నిలిచే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా వంటి జట్టును ఓడించాలని సూచించాడు. గతంలో భారత్ ప్రపంచకప్లను గెలిచిన సందర్భాలనూ గంభీర్ ఉదహరించాడు.
‘‘వరల్డ్ కప్ను నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగితే మాత్రం ఆస్ట్రేలియాను తప్పకుండా ఓడించాల్సిందే. ఆ జట్టు మెగా టోర్నీల్లో అత్యంత బలమైంది. మేం 2007 టీ20 ప్రపంచ కప్లో ఆసీస్ను సెమీస్లో ఓడించాం. అప్పుడు విజేతగా నిలిచాం. ఆ తర్వాత 2011లోనూ క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ను మట్టికరిపించాం. రెండోసారి వన్డే ప్రపంచకప్ ఛాంపియన్గా అవతరించాం. ఐసీసీ టోర్నీల్లో ఏదొక దశలో ఆసీస్ను భారత్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఆసీస్పై గెలిస్తే దాదాపు కప్ను సొంతం చేసుకున్నట్లే. అందుకే, వరల్డ్ కప్లో ర్యాంకింగ్కు సంబంధమే లేదు.
మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత్ ఆధిపత్యం
ప్రస్తుతం భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా తర్వాత స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. మెగా టోర్నీల్లో ఆ జట్టుతో గట్టి పోటీ ఉంటుంది. ఆటగాళ్లు కూడా అంతే పట్టుదలతో ఆడతారు. టీమ్ఇండియా గత రెండు వరల్డ్ కప్ (టీ20, వన్డే) టోర్నీల్లో విజేతగా నిలిచిందంటే దానికి కారణం ఆసీస్ను నాకౌట్ దశలో ఓడించడమే. అలాగే 2015 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఒకవేళ అక్కడా గెలిచి ఉంటే ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఎక్కువ. ఈసారి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్ ఆసీస్తోనే జరగనుంది. ఇందులో గెలిస్తే తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే, మనకు తొలి మ్యాచ్ చాలా కీలకం’’ అని గంభీర్ తెలిపాడు. ప్రస్తుతం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్శర్మ డ్రెస్సింగ్రూమ్లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో బ్యాటర్గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వద్ద కొనసాగుతున్న పోలీసు పహారా
-
Purandeswari: ఓట్ల కోసమే ‘నాగార్జునసాగర్’ వివాదం: పురందేశ్వరి
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
-
ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు..