సంక్షిప్త వార్తలు
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ముష్ఫికర్ రహీమ్ ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించాడు.
ముష్ఫికర్ రికార్డు శతకం
సిలెట్: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ముష్ఫికర్ రహీమ్ ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యంత వేగవంతమైన శతకం సాధించాడు. ఐర్లాండ్తో రెండో వన్డేల్లో ముష్ఫికర్ 60 బంతుల్లోనే సెంచరీ (100 నాటౌట్; 14×4, 2×6) చేశాడు. ముష్ఫికర్ 33వ ఓవర్లో క్రీజులోకి వచ్చి, ఇన్నింగ్స్ చివరి బంతికి శతకాన్నందుకున్నాడు. లిటన్ దాస్ (70), నజ్ముల్ శాంటో (73), తౌహిద్ హృదాయ్ (49) కూడా రాణించడంతో బంగ్లా 50 ఓవర్లలో 6 వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే బంగ్లా ఇన్నింగ్స్ అయ్యాక వర్షం ముంచెత్తడంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలలేదు. మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో బంగ్లా నెగ్గింది.
‘లక్ష్య’ అథ్లెట్ సంజయ్కు కాంస్యం
ఈనాడు, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మరో పతకం ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ల ఖాతాలో చేరింది. సోమవారం పుణెలో జరిగిన పురుషుల డిస్కస్ త్రో ఎఫ్11 విభాగంలో నీలం సంజయ్ రెడ్డి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. అనంతపురానికి చెందిన అతను పోటీల్లో మంచి ప్రదర్శనతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి విద్యా సంస్థల సుదీర్ఘ కాల అథ్లెటిక్స్ శిక్షణ శిబిరానికి చెందిన రవికిరణ్ జావెలిన్ త్రోలో కాంస్యం నెగ్గాడు.
నాదల్.. 18 ఏళ్లలో తొలిసారి
ఇండియన్వెల్స్: స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్-10లో చోటు కోల్పోయాడు. తాజా ర్యాంకింగ్స్లో అతను నాలుగు స్థానాలు తగ్గి 13వ ర్యాంకుకు పరిమితం అయ్యాడు. గత 18 ఏళ్లలో నాదల్ టాప్-10లో చోటు కోల్పోవడం ఇదే తొలిసారి. జకోవిచ్ను వెనక్కి నెట్టి అల్కరాజ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
న్యూయార్క్.. ముంబయి సొంతం
దిల్లీ: అమెరికా వేదికగా జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో మరో భారత జట్టు అడుగుపెట్టింది. జులై 13న ఆరంభం కానున్న ఈ లీగ్లో న్యూయార్క్ ఫ్రాంఛైజీని ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. ఇంతకుముందు జీఎంఆర్ గ్రూప్ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్స్.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి సియాటెల్ ఆర్కాస్ జట్టులో పెట్టుబడులు పెట్టింది. టెక్సాస్ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా ఉంది. ‘‘ముంబయి కుటుంబంలోకి న్యూయార్క్ ఫ్రాంఛైజీని ఆహ్వానిస్తున్నాం. అమెరికాలో జరుగుతున్న తొలి టీ20 లీగ్లో ముంబయి రాక మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇది మాకు మరో ఆరంభం’’ అని ఆ జట్టు యజమాని నీతా అంబానీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగుల్లో ముంబయికి న్యూయార్క్ అయిదో ఫ్రాంఛైజీ. ముంబయి ఇండియన్స్ (ఐపీఎల్), ఎంఐ కేప్టౌన్ (ఎస్ఏ20), ఎంఐ ఎమిరేట్స్ (ఐఎల్టీ20), ముంబయి ఇండియన్స్ (డబ్ల్యూపీఎల్) ఇప్పటికే ముంబయి తరఫున ఆడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434