గాయత్రి జోడీ ఓటమి

స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు చుక్కెదురైంది. ఈ అయిదో సీడ్‌ జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.

Published : 27 Mar 2024 01:49 IST

స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌

మాడ్రిడ్‌: స్పెయిన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు చుక్కెదురైంది. ఈ అయిదో సీడ్‌ జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. మంగళవారం గాయత్రి-ట్రీసా ద్వయం 18-21, 22-20, 18-21తో అనె-కెరీ (అమెరికా) జంట చేతిలో కంగుతింది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో మిథున్‌ మంజునాథ్‌ ముందంజ వేశాడు. అతడు ప్రిక్వార్టర్స్‌లో 15-21, 24-22, 21-18తో సహచర షట్లర్‌ శంకర్‌ ముత్తుస్వామిని ఓడించి క్వార్టర్స్‌ చేరాడు. సమీర్‌ వర్మ 21-9, 21-12తో అల్వారో లెల్‌ (స్పెయిన్‌)ను ఓడించి క్వాలిఫయర్స్‌ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. పురుషుల డబుల్స్‌ క్వాలిఫయర్స్‌ తొలి రౌండ్లో కృష్ణ ప్రసాద్‌-సాయి ప్రతీక్‌ జోడీ 21-15, 28-30, 21-11తో డోంగ్‌-యకురా (కెనడా) జంటను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని