Rahul Dravid: కరోనా నుంచి కోలుకున్న ద్రవిడ్‌

టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజా పరీక్షలో నెగెటివ్‌ రావడంతో ద్రవిడ్‌ వెంటనే దుబాయ్‌కి బయల్దేరాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడడానికి ముందే అతను జట్టుతో కలిశాడు. టోర్నీ

Updated : 29 Aug 2022 02:49 IST

జట్టుతో చేరిక

దుబాయ్‌: టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజా పరీక్షలో నెగెటివ్‌ రావడంతో ద్రవిడ్‌ వెంటనే దుబాయ్‌కి బయల్దేరాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ ఆడడానికి ముందే అతను జట్టుతో కలిశాడు. టోర్నీ కోసం స్వదేశం నుంచి దుబాయ్‌ బయల్దేరే ముందు జట్టు సభ్యులు, సహాయ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో ద్రవిడ్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతను జట్టుతో పాటు విమానం ఎక్కలేదు. ద్రవిడ్‌ స్థానంలో టోర్నీకి తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను నియమించింది. ద్రవిడ్‌ తిరిగొచ్చేస్తుండడంతో లక్ష్మణ్‌ ఇండియా-ఎ జట్టు శిక్షణను పర్యవేక్షించేందుకు బెంగళూరుకు బయల్దేరినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని