టైటాన్స్‌ 19వసారి..

ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్‌ రాత మారడం లేదు. ఈ సీజన్‌లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్‌ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది.

Published : 07 Dec 2022 01:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీలో సొంతగడ్డపై ఆడుతున్నా తెలుగు టైటాన్స్‌ రాత మారడం లేదు. ఈ సీజన్‌లో అట్టడుగున కొనసాగుతున్న టైటాన్స్‌ 19వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. మంగళవారం గుజరాత్‌ జెయింట్స్‌ 44-30తో తెలుగు టాటాన్స్‌ను ఓడించింది. టైటాన్స్‌ తరఫున అభిషేక్‌ సింగ్‌ 9 పాయింట్లతో రాణించాడు.  గుజరాత్‌ జట్టులో ప్రతీక్‌ దహియా (17)ను కాచుకోవడం టైటాన్స్‌ తరం కాలేదు. డాంగ్‌ గియోన్‌ (9) కూడా మెరిశాడు. మరోవైపు ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో దబాంగ్‌ దిల్లీ విజయం సాధించింది. మంగళవారం 41-24తో యు ముంబాను చిత్తు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని