IND vs WI: రోహిత్‌ గొప్ప రికార్డు.. ఈ విషయంలో నంబర్‌ 1 కెప్టెన్‌!

టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌ వైట్‌వాష్‌లు చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు...

Published : 22 Feb 2022 01:39 IST

విండీస్‌పై టీ20 సిరీస్‌ వైట్‌వాష్‌ విశేషాలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్‌ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 17 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో పొట్టి సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతోనే భారత్‌ కైవసం చేసుకుంది. దీంతో ఈ పర్యటనలో కరీబియన్‌ జట్టు ఒక్క విజయం సాధించకుండానే ఇంటిముఖం పట్టింది. మరోవైపు రోహిత్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఇదివరకు మూడు సార్లు ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 2017లో శ్రీలంకపై, 2018లో వెస్టిండీస్‌పై, 2021లో న్యూజిలాండ్‌పై అన్ని మ్యాచ్‌లూ గెలుపొందింది.

* గత నాలుగు టీ20 సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శన..

2018లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-0తో విజయం.
2019లో వెస్టిండీస్‌ పర్యటనలోనూ 3-0తో గెలుపు.
2019లో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్‌ 2-1తో విజయం.
2022లో స్వదేశంలోనే 3-0తో సిరీస్‌ కైవసం.

* టీ20ల్లో టీమ్‌ఇండియాకు అత్యధిక సార్లు వరుస విజయాలు సాధించిన సందర్భాలు..

2020 జనవరి - డిసెంబర్‌ మధ్య 9 విజయాలు.
2021 నవంబర్‌ - 2022 ఫిబ్రవరి మధ్య 9 విజయాలు.
2012 డిసెంబర్‌ - 2014 ఏప్రిల్‌ మధ్య 7 విజయాలు.
2016 ఫిబ్రవరి - మార్చి మధ్య 7 విజయాలు.
2018 మార్చి - జులై మధ్య 7 విజయాలు.

* టీ20ల్లో కెప్టెన్‌గా వరుసగా అత్యధిక విజయాలు సాధించిన సారథులు..
12 అస్గర్‌ అఫ్గాన్‌ అఫ్గానిస్థాన్‌ (2018-2020)
9 సర్ఫరాజ్‌ అహ్మద్‌ పాకిస్థాన్‌ (2018)
9 రోహిత్‌ శర్మ భారత్‌ (2019-2022)

* టీ20ల్లో అత్యధిక ఓటములు చెందిన జట్లు (సూపర్‌ ఓవర్లతో సహా)
83 వెస్టిండీస్‌
82 శ్రీలంక
78 బంగ్లాదేశ్‌
76 న్యూజిలాండ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని