Rohit Sharma: వాటి వల్ల నిరాశకు గురయ్యా.. కోహ్లీది గొప్ప ఇన్నింగ్స్: రోహిత్
వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించినా ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడం కాస్త బాధ కలిగించిందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు...
ఇంటర్నెట్డెస్క్: వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా విజయం సాధించినా ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడం కాస్త బాధ కలిగించిందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. గతరాత్రి భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించి పొట్టి సిరీస్నూ 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. విండీస్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ (62), రోమన్ పావెల్ (68*) దంచికొట్టడంతో ఒకానొక దశలో ఆ జట్టు విజయం సాధించేలా కనిపించింది. కానీ.. హర్షల్ పటేల్, భువనేశ్వర్ చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేసి టీమ్ఇండియాను గెలిపించారు. కాగా, ఈ విండీస్ బ్యాట్స్మెన్ ఇద్దరూ అంతకుముందే ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకొన్నారు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూనే ఆటగాళ్లు క్యాచ్లు వదిలేయడంపై విచారం వ్యక్తం చేశాడు.
‘వెస్టిండీస్తో ఆడాలంటే ఎప్పుడూ భయమేస్తుంది. వాళ్లతో పోటీ అంటే కష్టంగా ఉంటుందని తెలుసు. అందుకు తగ్గట్టుగానే మేం సన్నద్ధమై బరిలోకి దిగాం. ఒత్తిడిలోనూ మా ప్రణాళికలన్నీ అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇక భువనేశ్వర్ బౌలింగ్ చేసిన 19వ ఓవర్ చాలా కీలకమైనది. అక్కడ అనుభవమే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఎన్నో ఏళ్లుగా అతడు అదే పని చేస్తున్నాడు. అతడి టాలెంట్పై మాకు నమ్మకం ఉంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. అనంతరం కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ‘మొదట్లోనే అతడు దూకుడుగా ఆడటంతో నాపై ఒత్తిడి తగ్గింది. అతడి నుంచి ఇదో గొప్ప ఇన్నింగ్స్. అలాగే పంత్, శ్రేయస్ అయ్యర్ కూడా బాగా ఆడారు. వారిద్దరూ మంచి ముగింపునిచ్చారు. వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాడు చివర్లో ఒక ఓవర్ బౌలింగ్ చేస్తానని కోరాడు. అతడి నుంచి అలాంటి పరిణతి చూడటం ముచ్చటేసింది. అయితే ఫీల్డింగ్ విషయంలోనే నేను కాస్త నిరాశకు గురయ్యా. అందులో మేం తడబడ్డాం అనిపించింది. ఒకవేళ వదిలేసిన క్యాచ్లు పట్టి ఉంటే మ్యాచ్ మరో రకంగా ఉండేది’ అని రోహిత్ పేర్కొన్నాడు. కాగా, ఛేదనలో తొలుత పూరన్ 21 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా చాహల్ బౌలింగ్లో మిడ్వికెట్లోకి బంతిని గాల్లోకి లేపాడు. కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని రవి బిష్ణోయ్ క్యాచ్ను జారవిడిచాడు. అప్పటికి విండీస్ 9 ఓవర్లలో 60 పరుగులు చేసింది. ఇక 26 బంతుల్లో 56 పరుగులు చేయాల్సిన స్థితిలో పావెల్ రిటర్న్ క్యాచ్ ఇవ్వగా భువనేశ్వర్ నేలపాలు చేశాడు. దీంతో వాళ్లిద్దరికీ జీవనదానం లభించి మ్యాచ్ను చివరివరకూ తీసుకెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్