IPL 2023: బుమ్రా లేకపోయినా.. ముంబయి విజేతగా నిలుస్తుంది: సన్నీ
ఐపీఎల్లో (IPL 2023) ఐదుసార్లు ఛాంపియన్.. కానీ, గత సీజన్లో దారుణ పరాభవాలతో చివరి స్థానంలోనిలిచింది. ఈసారి మాత్రం ఛాంపియన్గా నిలవాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీది ప్రత్యేక జర్నీ. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే, గత సీజన్లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ క్రమంలో మార్చి 31 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్లో ముంబయిని తక్కువగా అంచనా వేయొద్దని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ సూచించాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. అలాగే ఆల్రౌండర్ జై రిచర్డ్సన్ కూడా ఆడకపోవచ్చని సమాచారం. అయినా సరే ముంబయి జట్టు బలంగానే ఉందని సన్నీ చెప్పాడు.
‘‘గత సీజన్లో ఏంజరిగిందనేది ముంబయి ఇండియన్స్ జట్టు మరిచిపోవాలి. తిరిగి పుంజుకుంటామని బలంగా నమ్మాలి. స్టార్ పేసర్ బుమ్రాను ముంబయి మిస్ చేసుకుంది. అయితే, మరోసారి ఛాంపియన్గా నిలిచే జట్టు వారికుంది. తప్పకుండా పాయింట్ల పట్టికలో టాప్ - 3లో ముంబయిని చూస్తాం. గతేడాది దారుణమైన ప్రదర్శన నుంచి తొలుత ముంబయి బయటపడాలి’’ అని గావస్కర్ తెలిపాడు. ఏప్రిల్ 2వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి తొలి పోరులో తలపడనుంది. బుమ్రా గత ఆరేడు నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడటం లేదు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఐపీఎల్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి కీలక టోర్నీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఐదు టైటిళ్లను సొంతం చేసుకున్న చరిత్ర సృష్టించింది. మరోసారి గత వైభవాన్ని పునరావృతం చేయాలని ముంబయి భావిస్తోంది. అయితే బుమ్రా, రిచర్డ్సన్ దూరం కావడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిమానులను ఆందోళనకు గురి చేసే అంశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434