IPL 2022: ముంబయికి ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్‌ దూరం?

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్‌ మార్చి 27న దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ఆ జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దూరమయ్యే...

Published : 16 Mar 2022 02:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్‌ మార్చి 27న దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ఆ జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ దూరమయ్యే అవకాశం ఉంది. అతడు ఇటీవల గాయపడటంతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో లేని సంగతి తెలిసిందే. అతడింకా కోలుకోలేకపోవడంతో దిల్లీతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడించొద్దని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌ తర్వాత ముంబయి ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌తో రెండో మ్యాచ్‌లో ఆడనుంది. దీంతో అప్పటికల్లా సూర్యకుమార్‌ కోలుకుంటాడని ఆశిస్తోంది. కాగా, ప్రస్తుతం అతడు జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు.

మరోవైపు ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సోమవారం శ్రీలంకతో పింక్‌ బాల్‌ టెస్టు పూర్తయ్యాక వెంటనే తన భార్య రితిక, కుమార్తె సమైరాతో కలిసి ఆ జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. అతడితో పాటు ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా సైతం ముంబయిలో వాలిపోయాడు. వీరిద్దరూ లంకతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటంతో బయోబబుల్‌లోనే ఉన్నారు. దీంతో వారు ఇప్పుడు విడిగా మూడు రోజుల క్వారంటైన్‌ ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా జట్టుతో కలిసిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని