Ishan - Dhoni: అక్కడ మహీభాయ్ ఆటోగ్రాఫ్ ఉంది.. నేను సంతకం పెట్టలేను: ఇషాన్ కిషన్
బ్యాట్తోనే కాదు తన ప్రవర్తనతో టీమ్ఇండియా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకొన్నాడు యువ బ్యాటర్ ఇషాన్ కిషన్. ప్రస్తుతం అతడు ఝార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బంగ్లాదేశ్పై మూడో వన్డేలో అద్భుతంగా డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన ఝార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ తాజాగా నెటిజన్ల మనస్సును మరోసారి కొల్లగొట్టాడు. అయితే ఇదేమీ మైదానంలో ఆటగాడిగా కాదు సుమా.. ఆఫ్ ఫీల్డ్లో అభిమానులతో జరిగిన సంభాషణ నెట్టింట్లో వైరల్గా మారింది. ఇంతకీ ఇషాన్ చేసిందేమిటో తెలుసుకోండి..
ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మరి అదే రాష్ట్రం నుంచి (ఝార్ఖండ్) వచ్చిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫ్యాన్ కాకుండా ఉంటాడా..? అందులోనూ ఇద్దరూ వికెట్ కీపింగ్ బ్యాటర్లే కావడం విశేషం. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ అనంతరం స్వదేశానికి వచ్చిన ఇషాన్ కిషన్ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఝార్ఖండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో అభిమానులతో కలిసి ఫొటోషూట్, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు ఇస్తూ బిజీగా గడిపాడు.
ఇలా చేస్తుండగా.. ఓ అభిమాని తన సెల్ఫోన్ వెనుక భాగంలో ఆటోగ్రాఫ్ చేయాలని ఇషాన్ను కోరాడు. ఇక్కడే అసలైన కథ మొదలైంది. సరే చేద్దామని తీసుకొన్న ఇషాన్.. నేను చేయలేనంటూ బదులిచ్చాడు. అక్కడున్నవారంతా కాస్త అయోమయానికి గురయ్యారు. ఇంతలో ఇషాన్ మాట్లాడుతూ.. ఇక్కడ మహీ భాయ్ (మహేంద్ర సింగ్ ధోనీ) సంతకం ఉంది. నువ్వు దాని మీద ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగావు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే నేను ఎంఎస్ ధోనీ స్థాయికి చేరుకోలేదు. కాబట్టి ధోనీ భాయ్ ఆటోగ్రాఫ్కి కిందివైపున నేను సంతకం పెడతా.’’ అని ఇషాన్ చెప్పాడు. ధోనీ ఆటోగ్రాఫ్ కిందనే సంతకం చేసి సదరు అభిమానికి ఇచ్చాడు. ఈ వీడియోను ఓ అభిమాని యూట్యూబ్లో షేర్ చేశాడు.
భారత టీ20 లీగ్ గత సీజన్లో నిర్వహించిన మెగా వేలంలో అత్యంత భారీ ధరను దక్కించుకొన్న ఇషాన్ కిషన్.. ముంబయి తరఫున ఆ సీజన్లో పెద్దగా రాణించలేదు. కానీ భారత్ తరఫున వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజేతులా అందిపుచ్చుకొనేందుకు సిద్ధంగా ఉంటాడు. అలాగే బంగ్లాపై వచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకొని ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. దీంతో వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం బరిలో నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..