kL RAHUL: విండీస్తో టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్ దూరం
టీమ్ఇండియా వరుస సిరీస్లతో బిజీగా గడుపుతుంటే..స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్లకు దూరం అవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వరుస సిరీస్లతో బిజీగా గడుపుతుంటే.. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వివిధ కారణాలతో కీలక సిరీస్లకు దూరం అవుతున్నాడు. తాజాగా అందిన నివేదికలు ప్రకారం విండీస్తో టీ20 సిరీస్కు రాహుల్ ఉండడని, అతడికి బీసీసీఐ వైద్యబృందం వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. భారత టీ20 లీగ్ అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపికైనా కేఎల్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడి ఆ సిరీస్కు దూరమయ్యాడు. ఆ తరవాత బీసీసీఐ వైద్య బృందం అతడి గాయం తీవ్రత పెరిగిందని చెప్పడంతో ఇంగ్లాండ్ పర్యటనకు రాహుల్ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించింది. గత నెలలో వైద్యుల సూచన మేరకు రాహుల్ జర్మనీలో హెర్నియా సర్జరీ చేయించుకొన్నాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేసి త్వరలో మైదానంలో అడుగుపెడతానని చెప్పాడు. ఆ తరవాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించడం కోసం ప్రాక్టీస్ చేశాడు.
సెలెక్టర్లు విండీస్తో వన్డే సిరీస్కు అతడిని పరిగణనలోకి తీసుకోకపోయినా, టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. దీంతో ఇక్కడైనా రాహుల్ ఆట చూడొచ్చని అభిమానులు ఆశించారు. అయితే, ఈ నెల 21న రాహుల్కు కొవిడ్ సోకినట్లు బీసీసీఐ తెలియజేసింది. దీంతో అతడు ఐసోలేషన్ ఉండి కొవిడ్ నుంచి కోలుకున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటికే విండీస్తో టీ20 సిరీస్కు కొందరు ఆటగాళ్లు ట్రినిడాడ్ చేరుకొన్నారు. రాహుల్ మొదటి మూడు టీ20లకు అందుబాటులో లేకపోయినా, చివరి రెండు మ్యాచ్లకు జట్టుతో కలుస్తాడని భావించారు. అయితే, తాజాగా అందిన నివేదికల ప్రకారం రాహుల్ ఈ సిరీస్కు కూడా పూర్తిగా దూరమైనట్లు తెలిసింది. జింబాబ్వేతో ఆగస్టు 18న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రాహుల్ పునరాగమనం చేసే అవకాశం ఉంది. రాహుల్ గైర్హాజరీలో రిషబ్ పంత్ ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో ఓపెనింగ్ చేశాడు. విండీస్ సిరీస్లో పంత్ లేదా ఇషాన్ కిషన్లో ఒకరు రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తారు. అయితే, రాహుల్ ఆసియా కప్ నాటికి అందుబాటులోకి వస్తే ఓపెనర్గా ఎవరు వస్తారన్నదే ఆసక్తికరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.