Covid: పుజారా, ఉతప్ప ఉండటంతో భయమేసింది!
కరోనా నుంచి కోలుకోవడం డిస్కవరీలో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనుభవాన్ని తలపించిందని చెన్నై సూపర్కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ...
లక్ష్మీపతి బాలాజీ, వరుణ్ చక్రవర్తి కొవిడ్ అనుభవాలు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా నుంచి కోలుకోవడం డిస్కవరీలో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనుభవాన్ని తలపించిందని చెన్నై సూపర్కింగ్స్ బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ అన్నాడు. చెతేశ్వర్ పుజారా, రాబిన్ ఉతప్ప తన దగ్గరే ఉండటంతో భయపడ్డానని వెల్లడించాడు. వైరస్ నుంచి కోలుకొన్న రెండు వారాల వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవడం మంచిదని మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. నెగెటివ్ వచ్చాక వీరిద్దరూ మీడియాతో తొలిసారి మాట్లాడారు.
సగం సీజన్ ముగిశాక ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా వైరస్ సోకడమే ఇందుకు కారణం. కోల్కతాలో ఆడుతున్న వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, దిల్లీ ఆటగాడు అమిత్ మిశ్రా, హైదరాబాద్ కీపర్ వృద్ధిమాన్ సాహా, చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి పాజిటివ్ వచ్చింది. దాంతో లీగ్ను అప్పటికప్పుడే వాయిదా వేశారు.
‘కొవిడ్-19 నుంచి మానసికంగా, శారీరకంగా కోలుకోవడం మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ అనుభవాన్ని తలపించింది. మే 2న కాస్త నలతగా అనిపించింది. ఒళ్లు నొప్పులు, ముక్కు బిగుసుకుపోవడం కనిపించాయి. ఆ రోజు మధ్యాహ్నమే పరీక్ష చేయించుకున్నా. మే 3న పాజిటివ్ వచ్చిందని తెలియడంతో షాకయ్యా. నేనెసలు బుడగ నిబంధనలు ఉల్లంఘించనే లేదు’ అని లక్ష్మీపతి బాలాజీ అన్నాడు.
‘మొదట ఏం మాట్లాడాలో తెలియలేదు. బయట ప్రజలు చనిపోతున్నారని తెలుసు. ఒక రోజు గడిచాక విషయం తీవ్రత అర్థమైంది. పాజిటివ్ రావడానికి ముందు నేను ఆటగాళ్లను కలవడంతో వారికి ఏమవుతోందనని భయపడ్డా. రాజీవ్ కుమార్ (ఫీల్డింగ్ కోచ్), రాబిన్ ఉతప్ప, పుజారా, దీపక్ చాహర్, కాశీ సర్ (సీఈవో) నా పక్కనే ఉన్నారు’ అని బాలాజీ గుర్తు చేసుకున్నాడు.
కరోనా వైరస్ సోకినప్పుడు మానసికంగా బలంగా ఉండాలని వరుణ్ చక్రవర్తి చెప్పాడు. బయటి విషయాలతో మనసు పాడుచేసుకోవద్దని సూచించాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులు, జట్టు సభ్యులతో దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిపాడు. ‘నాకు జలుబు, జ్వరం లేవు. బలహీనత, అలసట వంటి లక్షణాలు కనిపించాయి. మధ్యలో వాసన, రుచి కోల్పోయాను. కొవిడ్ నుంచి కోలుకుంటున్న క్రీడాకారులకు చెప్పేదొకటే. నెగెటివ్ వచ్చాక కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. మాస్క్ ధరించే బయటికి వెళ్లాలి. త్వరలోనే నేను సాధన ఆరంభిస్తాను’ అని వరుణ్ ధీమా వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.