T20 League : టీ20 లీగ్.. ‘99’ మ్యాచ్లు.. రెండో స్థానంలో రాహుల్
ఏ ఫార్మాట్లోనైనా వంద మ్యాచ్లు ఆడటమంటే ప్రత్యేకమే. అదీనూ ఒకే లీగ్లో ఆ ఘనత ...
(ఫొటో సోర్స్: కేఎల్ రాహుల్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్ : ఏ ఫార్మాట్లోనైనా వంద మ్యాచ్లు ఆడటమంటే ప్రత్యేకమే. అదీనూ ఒకే లీగ్లో ఆ ఘనత సాధించాలంటే.. కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరును ప్రదర్శించాలి. అయితే వందో మ్యాచ్ ముందు వరకు (99) ఆడిన మ్యాచుల్లో భారీగా పరుగులు చేసిన వారి జాబితాలో ఇద్దరు టీమ్ఇండియా ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఒకరు మాజీ కాగా.. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్.. ఇంతకీ ఈ లిస్ట్లోని భారత ప్లేయర్లు ఎవరు.. మొదటి స్థానంలో ఉన్న .. ఆ తర్వాతి బ్యాటర్లు ఎవరనేది తెలుసుకుందాం..
- క్రిస్ గేల్: బంతి దొరికితే చాలు బౌండరీ ఆవలకు పంపించేందుకు సుడిగేల్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మరి అలాంటి క్రిస్ గేల్ ఫామ్లో లేకపోవడంతో ఈ సారి ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. అయినా ఇప్పటికీ గేల్ మీద రికార్డులు ఉండటం విశేషం. గత సీజన్ వరకు 142 మ్యాచ్లను ఆడిన గేల్ ఆరు శతకాలు, 31 అర్ధశతకాలతో 4,965 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 175 నాటౌట్. ఇలాంటి క్రిస్ గేల్ 99 మ్యాచ్లు ఆడేటప్పటికి 3,578 పరుగులు చేసి ఈ జాబితాలో టాప్లో ఉన్నాడు.
- కేఎల్ రాహుల్ : ప్రస్తుతం జరుగుతున్న టీ20 లీగ్లో మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. గత సీజన్లోనూ అద్భుతంగా రాణించాడు. లఖ్నవూ సారథ్య బాధ్యతలను స్వీకరించిన రాహుల్ ఇవాళ (ఏప్రిల్ 16) ముంబయితో జరుగుతున్న మ్యాచ్ వందో గేమ్. ఈ క్రమంలో ఇప్పటివరకు 99 మ్యాచ్లను ఆడిన కేఎల్ రాహుల్ 3405 పరుగులు చేశాడు. దీంతో 99 మ్యాచ్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక తన వందో మ్యాచ్లో రాహుల్ (103*) సెంచరీ చేశాడు.
- డేవిడ్ వార్నర్: మొన్నటి వరకు హైదరాబాద్ జట్టు తరఫున కీలక ప్లేయర్గా మారిన డేవిడ్ వార్నర్ ఈసారి దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 99 మ్యాచ్ల తర్వాత వార్నర్ 3,304 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు డేవిడ్ వార్నర్ టీ20 లీగ్ కెరీర్లో 145 మ్యాచ్లకుగాను 5,351 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, 50 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 126*.
- డుప్లెసిస్: బెంగళూరును విజయపథంలో నడిపిస్తోన్న డుప్లెసిస్ బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో ఐదు మ్యాచుల్లో 88 అత్యధిక స్కోరుతో 146 పరుగులు చేశాడు. 99 మ్యాచ్ల్లోనే 2,849 పరగులు సాధించాడు. ఇప్పటి వరకు 105 మ్యాచ్లు ఆడిన డుప్లెసిస్ 130 స్ట్రైక్ రేట్తో 3,081 పరుగులు చేశాడు. డుప్లెసిస్ అత్యధిక స్కోరు 96. ఇందులో 23 అర్ధశతకాలు ఉన్నాయి.
- సురేశ్ రైనా: గత సీజన్ వరకు చెన్నై జట్టులో ‘చిన్న తలా’గా పేరుగాంచిన సురేశ్ రైనాకు ఈసారి చుక్కెదురైంది. మెగా వేలంలో ఎవరూ దక్కించుకోలేదు. ఇప్పటివరకు టీ20 లీగ్ చరిత్రలో 200 మ్యాచ్లు దాటిన వారిలో రైనా (205) ఒకడు. ఒక శతకం, 39 అర్ధశతకాలతో 5,528 పరుగులు చేసిన రైనా అత్యుత్తమ స్కోరు 100 నాటౌట్. స్ట్రైక్రేట్ 136.76 కావడం విశేషం. మరి అలాంటి రైనా తన 99 మ్యాచ్ల తర్వాత 2,802 పరుగులను చేశాడు. అయితే గత రెండేళ్లుగా సరైన ఫామ్లో లేకపోవడం సురేశ్ రైనాకు టీ20 లీగ్లో స్థానం దక్కకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.