Gambhir: యువరాజ్కు తగిన గుర్తింపు దక్కలేదు: గంభీర్
టీమ్ఇండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్కు తగిన గుర్తింపు దక్కలేదని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్ (Yuvaraj Singh)కు తగిన గుర్తింపు దక్కలేదని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) అభిప్రాయపడ్డాడు. ఒక వ్యక్తి, అతని పీఆర్ టీమ్ (Public Relations Team) ఈ ప్రపంచకప్ల్లో అతనిని హీరోగా చేశారని వ్యాఖ్యానించాడు. కానీ, వాస్తవానికి ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ను ఫైనల్కు తీసుకెళ్లింది యువరాజ్ సింగ్ అని గంభీర్ పేర్కొన్నాడు.
‘‘అతడు (యువరాజ్) ఎప్పుడూ నేను ప్రపంచ కప్ గెలిచానని చెబుతాడు. కానీ.. 2011, 2007 టీ20 ప్రపంచ కప్లలో మమ్మల్ని ఫైనల్స్కు తీసుకెళ్లిన వ్యక్తి యువరాజ్ సింగ్ అని నేను నమ్ముతున్నా. అతను రెండు టోర్నమెంట్లలో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అని అనుకుంటున్నా. నాకు కచ్చితంగా తెలియదు. (యువరాజ్ 2011లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకోగా.. 2007 టీ20 ప్రపంచకప్లో షాహిద్ అఫ్రిది మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు). 2007, 2011 ప్రపంచ కప్ల గురించి మాట్లాడేటప్పుడు మనం యువరాజ్ పేరును ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. మార్కెటింగ్, పీఆర్ టీమ్ ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వారిని తక్కువ చేసి చూపించారు. ఎవరూ తక్కువ కాదు. ఇదంతా మార్కెటింగ్, పీఆర్ టీమ్ మాయ. మనకు ఎవరు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్ కప్లు సాధించి పెట్టారో చెబుతూ వస్తున్నారు. కానీ అది ఆ ఒక్కడి వల్ల సాధ్యమైనది కాదు. దాంట్లో మొత్తం టీమ్ కృషి ఉంది. ఏ ఒక్కరో అంత పెద్ద టోర్నీ గెలవలేరు. అలా జరిగితే భారత్కు ఇప్పటికే 5-10 వరల్డ్ కప్లు ఉండేవి’’ అని గంభీర్ అన్నాడు.
భారత్లో జట్టు కంటే వ్యక్తి పూజ ఎక్కువని, అందుకే టీమ్ఇండియా చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీలు గెలవట్లేదని గంభీర్ అన్నాడు. ‘‘చాలా మంది ఈ విషమం చెప్పరు. కానీ, ఇది నిజం. నేను దీన్ని చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రపంచం ముందుకు రావాలి. మన దేశంలో జట్టు కంటే ఆటగాళ్లనే ఎక్కువగా చూస్తారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఆటగాడి కంటే జట్టే గొప్పది. మన దేశంలో బ్రాడ్కాస్టర్, మీడియాతోపాటు అందరూ పీఆర్ ఏజెన్సీలా మారారు. మన దేశంలో వ్యక్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు.. అందుకే చాలా కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవట్లేదు’’అని గంభీర్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం