Dhoni: అక్కడ ప్రారంభించకపోతే.. ఈ స్థాయికి చేరుకోలేము: ధోనీ
ఏ క్రికెటర్కైనా జిల్లాస్థాయి క్రికెట్ పోటీలే ముఖ్యమని, అక్కడి నుంచే క్రికెటర్ల ప్రయాణం మొదలవుతుందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: ఏ క్రికెటర్కైనా జిల్లాస్థాయి పోటీలే కీలకమని, అక్కడి నుంచే క్రికెటర్ల ప్రయాణం మొదలవుతుందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. తాజాగా తిరువల్లూర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవంలో పాల్గొన్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన రాంచీ క్రికెట్ అసోసియేషన్కు ధన్యవాదాలు తెలిపాడు. మొదట తాను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు స్కూల్ పోటీల్లో మంచి ప్రదర్శన చేయాలనుకున్నానని, దాంతో జిల్లా స్థాయి జట్టుకు.. అక్కడి నుంచి అంతర్ జిల్లా పోటీలకు.. అక్కడి నుంచి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికవ్వాలనుకున్నట్లు వెల్లడించాడు. అంతిమంగా ఎవరైనా అలా ఎదుగుతూ టీమ్ఇండియాకే ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు.
‘మీరు కూడా మొదట స్కూల్ స్టేజ్లో.. అక్కడి నుంచి జిల్లా స్థాయికి, తర్వాత రాష్ట్ర స్థాయికి.. ఆపై రంజీ జట్టుకు తర్వాత టీమ్ఇండియాకు ఆడాలనుకుంటారు. అలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టామన్నది గుర్తుంచుకోవాలి. జిల్లా స్థాయి జట్టులో చోటు దక్కించుకోవాలని చాలా మంది ఆశపడతారు. దాంతో పోటీ తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు మేటి ఆటగాళ్లే క్రమంగా పై స్థాయిలకు ఎదుగుతారు. తద్వారా జిల్లా స్థాయి జట్లతో పాటు రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా నాణ్యమైన ఆటగాళ్లతో నిండిపోతాయి. అది అందరికీ మంచిది. నేను టీమ్ఇండియా తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తా. ఒకవేళ నేను జిల్లా స్థాయిలో ఆడకపోతే ఇక్కడిదాకా వచ్చేవాడిని కాదు. కాబట్టి ఆ స్థాయిలో క్రికెట్ ఆడినందకు ఎవరైనా గర్వపడాలి. అక్కడ మన ప్రయాణం మొదలవ్వకపోతే టీమ్ఇండియాలో ఆడే అవకాశం రాదు. ఈ నేపథ్యంలో మేటి ఆటగాళ్లను ఎంపిక చేయడంలో జిల్లా స్థాయి క్రికెట్ అసోసియేషన్ల బాధ్యత చాలా ఉంది. వాళ్లు ఏటా టోర్నీలు నిర్వహించి, అందుకు పాఠశాలల స్థాయిలో పోటీలు నిర్వహించడం, మంచి ఆటగాళ్లను వెలికి తీయడం కష్టంగా ఉంటుంది’ అని ధోనీ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434