Ellyse Perry: నాకు బీమా లేదనుకుంటా.. కారు అద్దం ధ్వంసంపై ఎలీస్ పెర్రీ
బెంగళూరులో యూపీపై జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ ఎలీస్ పెర్రీ కొట్టిన ఓ షాట్ వైరల్గా మారింది. బంతి అక్కడే ఉన్న కారు అద్దాన్ని ధ్వంసం చేసింది.
ఇంటర్నెట్డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్లో సీజన్-2లో ఆర్సీబీ తరఫున ఎలీస్ పెర్రీ నిన్న యూపీ వారియర్స్పై చెలరేగిపోయింది. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో కేవలం 37 బంతుల్లోనే 58 పరుగులు సాధించింది. 19వ ఓవర్లో సిక్స్ బాదింది. బంతి అక్కడే ప్రదర్శనకు ఉంచిన కారు అద్దాన్ని బద్దలు కొట్టింది. దీన్ని ప్రేక్షకులు, ఆటగాళ్లు ఆశ్చర్యంగా చూశారు. దీనికి పెర్రీ ప్రతిస్పందన కూడా భిన్నంగా ఉంది. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది.
మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూలో ఆ ఘటనపై పెర్రీ సరదాగా స్పందించింది. ‘‘ఆ కారు నష్టం చెల్లించడానికి నాకు బీమా ఉందో లేదో తెలియదు’’ అని పేర్కొంది. అంతేకాదు.. భారత్లోని ప్రేక్షకులను మెచ్చుకొంది. ‘‘నేను ఆడిన ఐదు మ్యాచ్లు మంచి అనుభవాన్నిచ్చాయి. నా కెరీర్లో ఇక్కడే అద్భుతమైన వాతావరణం చూశా. ప్రేక్షకుల నుంచి జట్టు సభ్యులకు లభించిన మద్దతు చాలా బాగుంది. గత రెండు నెలల్లో చాలా క్రికెట్ ఆడాను. ఈ మ్యాచ్లో తొలుత స్మృతిని సపోర్ట్ చేయడమే నా బాధ్యత. ఆ తర్వాత నేను స్వేచ్ఛగా ఆడాను. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది. నేడు మావాళ్లు మంచి ఫామ్లో ఉన్నారు’’ అని తన అభిప్రాయాన్ని పంచుకొంది.
ఆ ఓటమికి కెప్టెన్దే తప్పన్న కోచ్.. దినేశ్ కార్తిక్ ఆగ్రహం
మహిళల ప్రిమియర్ లీగ్ సీజన్-2లో వరుసగా రెండు ఓటముల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాడిలో పడింది. బ్యాటింగ్లో అదరగొట్టి.. బౌలింగ్లో సమష్టిగా సత్తా చాటి యూపీ వారియర్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. మొదట స్మృతి మంధాన , ఎలీస్ పెర్రీ మెరుపులతో ఆర్సీబీ 3 వికెట్లకు 198 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా యూపీ 175/8కే పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.