PAK vs AUS: స్మిత్.. డీఆర్ఎస్కు వెళ్లమంటావా వద్దా?.. రిజ్వాన్ వీడియో వైరల్
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో కంగారూ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా...
(Photo: Pakistan Cricket Board Twitter Video Screenshot)
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఓ సరదా సంఘటన చోటుచేసుకుంది. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో కంగారూ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. రెండు వికెట్లు పడ్డాక ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే, 71వ ఓవర్లో స్మిత్ 54 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా నౌమన్ అలీ వేసిన ఓ బంతి ప్యాడ్లకు తాకింది. దీంతో పాక్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. బంతి లెగ్స్టంప్కు బయట పిచ్ అవడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు డీఆర్ఎస్కు వెళ్లాలా వద్దా అనే డైలామలో పడ్డారు. అదే సమయంలో పాక్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.. స్టీవ్స్మిత్తో మాట్లాడుతూ రివ్యూకు వెళ్లమంటావా వద్దంటావా? అని సరదాగా అడిగాడు. ఆ సమయంలో స్మిత్ భుజాలపై చేతులేసి మరీ మాట్లాడటం గమనార్హం. ఆ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్విటర్లో పంచుకోవడంతో అది ఇప్పుడు వైరల్గా మారింది. అది చూసిన నెటిజన్లు కొంత మంది నవ్వుకుంటుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక చివరికి పాక్ జట్టు రివ్యూకు వెళ్లకపోవడంతో స్మిత్ అప్పుడు బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ, అతడు 72 పరుగులు చేశాక ఔటయ్యాడు. మీరూ ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.