Ramiz Raja: అజామ్పై అభిమానుల ట్రోలింగ్.. విరాట్ సెంచరీని ఉదహరించిన రమీజ్ రజా
అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మరో 17 రోజుల్లో పొట్టి ప్రపంచకప్లో మరోసారి టీమ్ఇండియా-పాక్ మ్యాచ్ జరగనుంది. గత ఆసియా కప్లో రెండుసార్లు దాయాదుల పోరును వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. అయితే చెరొక విజయంతో సమంగా నిలిచినా.. టీమ్ఇండియా మాత్రం సూపర్-4 దశలో ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్ ఫైనల్కు చేరుకొని లంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. అయితే తుదిపోరులో పాకిస్థాన్ ఓడిపోవడంపై అప్పట్లో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాక్ ఓడినప్పటికీ.. అప్పుడు కూడా భారత్పై పడి ఏడ్చిన పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా.. మరోసారి పాక్ అభిమానుల ప్రవర్తనను ఎలా ఉంటుందో చెప్పడానికి అఫ్గాన్పై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీని ఉదాహరణగా పేర్కొన్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ శతకం చేయడం అదే తొలిసారి కావడంతో టీమ్ఇండియా అభిమానుల ఆనందం అవధులు దాటింది. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఇంగ్లాండ్పై సెంచరీ చేసినా.. సరైన స్ట్రైక్రేట్ను కొనసాగించడం లేదని పాక్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘అఫ్గానిస్థాన్పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. దీంతో ఆసియా కప్లో జరిగిన మొత్తం ఎపిసోడ్ను భారత అభిమానులు మరిచిపోయారు. అలా మనం (పాక్ అభిమానులు) చేశామా? గత టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ సెమీస్కు చేరుకొంది. ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అలాగే ఆసియా కప్లోనూ పాక్ ఫైనల్కు చేరింది. కానీ మనదికాని రోజున ఓటమి తప్పదు. లంక చేతిలో ఓడి రన్నర్గా నిలిచాం. అయినా సరే బాబర్ అజామ్ స్ట్రైక్రేట్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాబర్ అజామ్ కూడా శతకం కొట్టాడు. కానీ స్ట్రైక్రేట్ 130కి తగ్గింది. అదే సమయంలో డేవిడ్ వార్నర్ స్ట్రైక్రేట్ (140) కూడా భారీగా లేదు. అందుకే ట్రోలింగ్ అంతా పనికిమాలిన అంశం’’ అని రమీజ్ రజా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
ఐపీఎల్ (IPL) 2024 సీజన్ ఆరంభానికి ముందు సన్రైజర్స్కు షాక్ తగిలింది. హైదరాబాద్ ఆడే తొలి మూడు మ్యాచ్లకు స్పిన్నర్ వానిందు హసరంగ దూరం కానున్నాడు. -
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్లో సిగరెట్ తాగిన క్రికెటర్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లోని ఇస్లామాబాద్ యునైటెడ్ ఆల్రౌండర్ ఇమాద్ వసీమ్ వివాదంలో చిక్కుకున్నాడు. -
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్
కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వివరించాడు. -
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?
Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా? -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు