Ramiz Raja: అజామ్పై అభిమానుల ట్రోలింగ్.. విరాట్ సెంచరీని ఉదహరించిన రమీజ్ రజా
అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్లు జరిగేది కేవలం మెగా టోర్నీల్లోనే.. అయితే ఇరు జట్ల ఆటగాళ్లను ఒకరినొకరితో పోల్చడం మాత్రం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. మరో 17 రోజుల్లో పొట్టి ప్రపంచకప్లో మరోసారి టీమ్ఇండియా-పాక్ మ్యాచ్ జరగనుంది. గత ఆసియా కప్లో రెండుసార్లు దాయాదుల పోరును వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. అయితే చెరొక విజయంతో సమంగా నిలిచినా.. టీమ్ఇండియా మాత్రం సూపర్-4 దశలో ఇంటిముఖం పట్టింది. పాకిస్థాన్ ఫైనల్కు చేరుకొని లంక చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. అయితే తుదిపోరులో పాకిస్థాన్ ఓడిపోవడంపై అప్పట్లో అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాక్ ఓడినప్పటికీ.. అప్పుడు కూడా భారత్పై పడి ఏడ్చిన పీసీబీ ఛైర్మన్ రమీజ్ రజా.. మరోసారి పాక్ అభిమానుల ప్రవర్తనను ఎలా ఉంటుందో చెప్పడానికి అఫ్గాన్పై విరాట్ కోహ్లీ చేసిన సెంచరీని ఉదాహరణగా పేర్కొన్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత విరాట్ శతకం చేయడం అదే తొలిసారి కావడంతో టీమ్ఇండియా అభిమానుల ఆనందం అవధులు దాటింది. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఇంగ్లాండ్పై సెంచరీ చేసినా.. సరైన స్ట్రైక్రేట్ను కొనసాగించడం లేదని పాక్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘అఫ్గానిస్థాన్పై విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు. దీంతో ఆసియా కప్లో జరిగిన మొత్తం ఎపిసోడ్ను భారత అభిమానులు మరిచిపోయారు. అలా మనం (పాక్ అభిమానులు) చేశామా? గత టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ సెమీస్కు చేరుకొంది. ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. అలాగే ఆసియా కప్లోనూ పాక్ ఫైనల్కు చేరింది. కానీ మనదికాని రోజున ఓటమి తప్పదు. లంక చేతిలో ఓడి రన్నర్గా నిలిచాం. అయినా సరే బాబర్ అజామ్ స్ట్రైక్రేట్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల బాబర్ అజామ్ కూడా శతకం కొట్టాడు. కానీ స్ట్రైక్రేట్ 130కి తగ్గింది. అదే సమయంలో డేవిడ్ వార్నర్ స్ట్రైక్రేట్ (140) కూడా భారీగా లేదు. అందుకే ట్రోలింగ్ అంతా పనికిమాలిన అంశం’’ అని రమీజ్ రజా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434