Rishabh Pant: రిషభ్పంత్ స్థానంలో అతడే సరైన ప్రత్యామ్నాయం: ప్రజ్ఞాన్ ఓజా
గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్లో దిల్లీ జట్టుకు అందుబాటులో ఉండడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్లో అద్భుతంగా రాణిస్తున్న ఫిల్ స్టాల్.. రిషభ్ స్థానంలో సరైన ప్రత్యామ్నాయమని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురైన టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ ఐపీఎల్ 2023 సీజన్లో ఆడటం కష్టమే. దీంతో అతడి స్థానంలో దిల్లీ క్యాపిటల్స్కు వార్నర్ను కెప్టెన్గా చేయాలని అభిమానులు కోరుతున్నారు. మరో ఆటగాడు ఫిల్ సాల్ట్కు తుది చోటు కల్పిస్తే మంచిదని భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా అభిప్రాయపడ్డాడు.
‘‘ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం దిల్లీ ఉన్న పరిస్థితుల్లో సాల్ట్ వంటి వ్యక్తి చాలా అవసరం. సాల్ట్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. రిషభ్పంత్ స్థానంలో అతడు గొప్పగా రాణించగలడు’’ అని ఓజా అభిప్రాయపడ్డాడు. గతేడాది రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ఐపీఎల్లో ఆడడం వీలుకాదని దిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలు చేపట్టే సౌరభ్ గంగూలీ ఇటీవల ప్రకటించాడు. దాంతో దిల్లీ జట్టుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఐపీఎల్ మినీ వేలంలో దిల్లీ ఫ్రాంచైజీ ఫిల్ సాల్ట్ను రూ. 2 కోట్లతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ మాదిరిగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఎస్ఏ20 లీగ్ జరుగుతోంది. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్న సాల్ట్ గురువారం మ్యాచ్లో విన్నింగ్ నాక్ ఆడాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు బాది 77 పరుగులు సాధించాడు. దీంతో ప్రిటోరియా క్యాపిటల్స్ , సన్రైజర్స్ ఈస్టెన్ కేప్ జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఈ లీగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన సాల్ట్ను ఓజా ప్రశంసించాడు. దిల్లీ జట్టుకు సాల్ట్ అవసరమని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం