PM Modi: ప్రధాని మోదీని కలిసిన థామస్ కప్ ఛాంపియన్లు
గత ఆదివారం థామస్ కప్ సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ బృందం ఈ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది...
(Photo: Anurag Thakur twitter)
దిల్లీ: థామస్ కప్ సాధించి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించిన బ్యాడ్మింటన్ బృందం ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయ్యింది. ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ వారితో కాపేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అలాగే క్రీడాకారులు ఆ మెగా ఈవెంట్లో తమకు ఎదురైన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్లో ఫొటోలు పంచుకొని వెల్లడించారు.
థామస్ కప్.. ప్రపంచ బ్యాడ్మింటన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్. ఇందులో మొన్నటిదాకా భారత జట్టు పతకమే గెలవలేదు. 1979 తర్వాత కనీసం ఈ టోర్నమెంట్లో సెమీస్ కూడా చేరలేదు. అలాంటిది ఈ పర్యాయం భారత షట్లర్లు అద్భుత ప్రదర్శన చేస్తూ.. మేటి జట్లను మట్టికరిపిస్తూ.. ఏకంగా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించారు. బలమైన ఆటగాళ్లతో టోర్నీలో బరిలోకి దిగిన పురుషుల జట్టు.. రికార్డు స్థాయిలో 14 సార్లు టైటిల్ సాధించిన ఇండోనేసియాను చిత్తుగా ఓడించి టైటిల్ నెగ్గింది. ఫైనల్లో ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా వరుసగా మూడు విజయాలతో భారత్ ట్రోఫీని ముద్దాడింది. తెలుగు కుర్రాళ్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్ ఈ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.