Ashwin: ఒత్తిడి కోసమే ఎదురు చూస్తుంటా.. అదే నా బలం: అశ్విన్
భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాను ఎప్పుడూ ఒత్తిడి కోసం ఎదరు చూస్తానని చెప్పాడు. ప్రతిదాన్ని పెద్ద మ్యాచ్గా చూస్తానని ఒత్తిడిని ఎంజాయ్ చేస్తానని అశ్విన్ తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తాను ఎప్పుడూ ఒత్తిడి కోసం ఎదరు చూస్తానని చెప్పాడు. ప్రతిదాన్ని పెద్ద మ్యాచ్గా చూస్తానని ఒత్తిడిని ఎంజాయ్ చేస్తానని అశ్విన్ తెలిపాడు. ఆఫ్ స్పిన్నర్గా తనదైన ముద్ర వేసిన అశ్విన్ టెస్టుల్లో 449 వికెట్లు పడగొట్టి కపిల్ రికార్డు(434 వికెట్లు)ను ఇదివరకే బద్ధలు కొట్టాడు. అత్యంత ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆల్రౌండర్ల జాబితాలో కపిల్ 5248 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ స్థానానికి చేరుకోవడానికి మాత్రం చాలా దూరంగానే ఉన్నాడు. గణాంకాల పరంగా కాకుండా.. ప్రస్తుతం కపిల్ తర్వాత రెండో ఉత్తమ ఆల్రౌండర్ అశ్విన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చపై అశ్విన్ స్పందించాడు. ‘అతి వినయం ప్రదర్శించడం, సందేహాస్పదంగా వ్యవహరించడం నాకు నచ్చదు. జీవితంలో ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఉత్తమంగా సాధించాలి. కపిల్ దేవ్ కేవలం గొప్ప భారత క్రికెటర్ మాత్రమే కాదు, ప్రపంచం గుర్తించిన అద్భుతమైన క్రికెటర్లలో ఒకరు. బ్యాట్, బంతి పట్టుకునే ఏ పిల్లవాడికైనా నేను చెప్పేది ఒకటే.. ఏది ఎంపిక చేసుకున్నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. గతంలో ఎవరు ఏ ఘనత సాధించారనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. ఏది చేసినా ప్రపంచంలో అత్యుత్తమంగా ఉండాలి. భారత్ తరఫున ఆడుతుంటే చాలా అంచనాలు ఉంటాయి. కచ్చితంగా మీకు ఎన్నో ఆకాంక్షలు ఉంటాయి. కానీ అవి మీ స్థాయిని తగ్గించకుండా చూసుకోవాలి. నేను ఎప్పుడూ ఒత్తిడి కలిగించే, గొప్ప క్షణాల కోసం జీవిస్తాను. ఏ మ్యాచ్ అయినా నాకు పెద్దదే. ప్రతి మ్యాచ్లో ఒత్తిడికి గురవుతాను ఎందుకంటే దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఒత్తిడి కోసం ఎదురు చూస్తుంటా’’ అని అశ్విన్ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో అశ్విన్ ఖాతాలో 5 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.