Ramiz Raja: న్యూజిలాండ్ది ఏకపక్ష నిర్ణయం: రమీజ్ రజా
పాకిస్థాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేస్తూ న్యూజిలాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) నూతన ఛైర్మన్ రమీజ్ రజా విమర్శించాడు. దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆటగాళ్లకు..
రావల్పిండి: పాకిస్థాన్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేస్తూ న్యూజిలాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) నూతన ఛైర్మన్ రమీజ్ రజా విమర్శించాడు. దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆటగాళ్లకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినా న్యూజిలాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విచారకరమని అన్నాడు. ‘ఇది చాలా బాధాకరమైన రోజు. న్యూజిలాండ్ నిర్ణయంతో పాకిస్థాన్ ఆటగాళ్లు, అభిమానులు నిరాశకు గురయ్యారు. ఆటగాళ్ల భద్రత గురించి కనీసం మాతో చర్చించకుండా న్యూజిలాండ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అది మమ్మల్ని అసహనానికి గురి చేసింది. న్యూజిలాండ్ ఏ ప్రపంచంలో జీవిస్తోంది? ఈ నిర్ణయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం’ అని రమీజ్ రజా ట్వీట్ చేశాడు.
‘పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ), పాకిస్థాన్ ప్రభుత్వం విదేశీ ఆటగాళ్ల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. న్యూజిలాండ్ పర్యటన కోసం కూడా పకడ్బంది ఏర్పాట్లు చేసింది. మరోవైపు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్తో వ్యక్తిగతంగా మాట్లాడి.. ఆటగాళ్ల భద్రతపై హామీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
భద్రతా కారణాల రీత్యా మ్యాచ్ ఆరంభ సమయానికి ఇరు జట్లు మైదానానికి చేరుకోలేదు. దీంతో సిరీస్ను రద్దు చేసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికార వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2003లో కూడా న్యూజిలాండ్ ఇదే విధంగా పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434