Ravi Shastri: అది నవ్వుకోవాల్సిన విషయం కాదు.. చాలా సీరియస్: రవిశాస్త్రి
ఒకసారి ఒక ఆటగాడు తనను 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీసినట్లు టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో భయంకరమైన సంఘటనను...
ఇంటర్నెట్డెస్క్: ఒకసారి ఒక ఆటగాడు తనను 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీసినట్లు టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్తో భయంకరమైన సంఘటనను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, అలా చేసిన క్రికెటర్ ఎవరో పేరు చెప్పాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అందులో టీమ్ఇండియా అభిమానులతో పాటు మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, మాజీ కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. ఈ విషయంపై తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన శాస్త్రి కాస్త ఘాటుగా స్పందించాడు. అది నవ్వుకోవాల్సిన విషయం కాదని, ఆందోళన కలిగించే విషయమన్నాడు.
‘చాహల్ను అలా వేలాడదీసిన ఆటగాడు ఎవరో నాకు తెలియదు. ఏ ఆటగాడైనా తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటే అది కచ్చితంగా క్షమించరాని విషయం. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అది కొందరికి హాస్యాస్పదంగా అనిపించినా నాకు మాత్రం చాలా సీరియస్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటిని సహించరాదు. నేను ఇలాంటి విషయం వినడం ఇదే తొలిసారి. అలాంటి సంఘటన ఇప్పుడు జరిగితే ఆ ఆటగాడిని జీవితకాలం నిషేధించేవారు. అలాగే వీలైనంత త్వరగా అతడిని పునారావాస కేంద్రానికి తరలించి చికిత్స అందించేవారు. అయినా, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితులు వెంటనే తెలియజేయాలి. అలా మౌనంగా ఉండకూడదు’ అని శాస్త్రి పేర్కొన్నాడు.
చాహల్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ‘‘నా కథ కొందరికి తెలుసు. దాని గురించి గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరితోనూ పంచుకోలేదు. 2013లో ముంబయికి ఆడుతున్నప్పుడు బెంగళూరులో మ్యాచ్ పూర్తయ్యాక పార్టీ జరిగింది. ఒక ఆటగాడు బాగా తాగి కాసేపు నన్నే చూశాడు. అతని పేరు నేను ఇప్పుడు చెప్పదల్చుకోలేదు. తర్వాత తన దగ్గరికి రమ్మని పిలిస్తే వెళ్లాను. దీంతో నన్ను బాల్కనీలోకి తీసుకెళ్లి కిందకి వేలాడదీశాడు. అప్పుడు నేను రెండు చేతులతో అతడిని గట్టిగా పట్టుకున్నా. అది 15వ అంతస్తు. ఏమాత్రం పట్టు తప్పినా నా పనైపోయేది. వెంటనే అక్కడున్న వాళ్లంతా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొద్దిసేపు నేను స్పృహ కోల్పోయా. నాకు నీళ్లు ఇచ్చాక తేరుకున్నా. ఆ సంఘటనతో బయటకు వెళితే ఎంత బాధ్యతగా ఉండాలో అర్థమైంది. ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నా. చిన్న పొరపాటు జరిగినా కిందపడిపోయేవాడిని. ప్రాణాలతో బయటపడేవాడిని కాదు’’ అని చాహల్ గుర్తుచేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు