ప్రతిసారీ ఈ చర్చేంటి?: హిట్మ్యాన్
భారత స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ మాజీలు చేస్తున్న విమర్శలను టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తాము ఎలాంటి....
ఇంటర్నెట్డెస్క్: భారత స్పిన్ పిచ్లపై ఇంగ్లాండ్ మాజీలు చేస్తున్న విమర్శలను టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ తీవ్రంగా ఖండించాడు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తాము ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నాడు. కానీ తమ పిచ్లపై ఎందుకు ప్రతిసారీ చర్చ చేస్తున్నారని ప్రశ్నించాడు. ఇరు జట్లూ ఒకే పిచ్పై ఆడుతుంటాయని, ఎవరు గొప్పగా ఆడితే వారినే విజయం వరిస్తుందని రోహిత్ అన్నాడు. అయినా, సొంత మైదాన ప్రయోజనాలను ఏ జట్టు అయినా సద్వినియోగం చేసుకుంటుందని గుర్తుచేశాడు. పిచ్ల విషయంలో అభ్యంతరాలేమైనా ఉంటే, అన్ని ప్రాంతాల్లో పిచ్లు ఒకేలా సిద్ధం చేసేలా ఐసీసీని కోరాలన్నాడు.
పిచ్ల గురించి ఆలోచించకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఎలా ఆడాలనే దానిపై దృష్టిసారించాలని హిట్మ్యాన్ సూచించాడు. పిచ్ల గురించి ఆలోచించినంత మాత్రాన పరిస్థితులేమి మారవన్నాడు. మొతెరా వికెట్ గురించి మాట్లాడుతూ.. రెండో టెస్టులో ఆడిన పిచ్ కంటే పెద్ద తేడాలేమీ ఉండవని తెలిపాడు. స్పిన్కు అనుకూలిస్తుందన్నాడు. చెపాక్ పిచ్పై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైకేల్ వాన్, మార్క్ వా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో రోహిత్ ఈ విధంగా స్పందించాడు. అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో బుధవారం నుంచి భారత్×ఇంగ్లాండ్ మూడో టెస్టు ప్రారంభం కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.