భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.
సిల్హట్ (బంగ్లాదేశ్): బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం వర్షం అంతరాయం కలిగించిన రెండో మ్యాచ్లో హర్మన్ సేన డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రాధ యాదవ్ (3/19), దీప్తి శర్మ (2/14), శ్రేయాంక పాటిల్ (2/24) బంగ్లాను కట్టడి చేశారు. ముర్షిదా ఖాతూన్ (46) ఆ జట్టులో టాప్ స్కోరర్. లక్ష్యఛేదనలో 5.2 ఓవర్లలో భారత్ 47/1తో ఉన్న దశలో వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది. ఇక మ్యాచ్ జరిగే అవకాశం లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. అప్పటికి లక్ష్యం (28 పరుగులు) కంటే 19 పరుగులు ఎక్కువ స్కోరు చేసిన భారత్ను విజేతగా ప్రకటించారు. భారత్ సాధించిన 47 పరుగుల్లో 41 హేమలత సాధించినవే కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
దూకుడుగా ఆడుతూ.. జట్టును కాపాడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో రనౌట్ కావడం ఏ బ్యాటర్కైనా తీవ్ర బాధను కలిగిస్తుంది. ఇదే అనుభవం రాహుల్ త్రిపాఠికి ఎదురైంది. -
కోల్‘కథ’ ఫైనల్కు
క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే 2018 నుంచి ఐపీఎల్ విజేతగా నిలుస్తోంది. 2018లో చెన్నై, 19, 20ల్లో ముంబయి, 21లో చెన్నై, 22లో గుజరాత్, 23లో చెన్నై ఇలాగే గెలిచాయి. -
రాయల్స్ సమరం
ఐపీఎల్లో రసవత్తర సమరానికి వేళెంౖది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం జరిగే ఎలిమినేటర్లో రాజస్థాన్ రాయల్స్ను ఢీకొంటుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న రెండు జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని భావిస్తున్నారు. -
సుమిత్దే స్వర్ణం
ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. ఒకేరోజు మూడు స్వర్ణాలు మన సొంతమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ సుమిత్ ఎఫ్-64, జావెలిన్త్రోలో పసిడి పతకాన్ని నిలబెట్టుకున్నాడు. మంగళవారం తుదిపోరులో అతడు జావెలిన్ను 69.50 మీటర్లలో విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. -
వయసుకు మినహాయింపు ఉండదు
క్రికెటర్గా కొనసాగాలంటే కఠోర సాధన చేయడం.. వీలైనంతగా ఫిట్గా ఉండడమే కీలకమని వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహేంద్రసింగ్ ధోని అన్నాడు. 43 ఏళ్లకు చేరువైన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు. -
సాత్విక్-చిరాగ్ నం.1 జోడీ
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ గెలిచిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జంట మళ్లీ నంబర్వన్ ర్యాంకును సాధించింది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో రెండో రౌండ్లోనే ఓటమి.. ఆసియా ఛాంపియన్షిప్లో వాకోవర్ తర్వాత భారత జంట అగ్రస్థానం నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది. -
రాణించిన సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్-1 టోర్నీలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండ్లో టాప్-3లో స్థానం త్రుటిలో చేజారింది. -
గాయత్రి జోడీ శుభారంభం
మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్- ట్రీసా జాలీ శుభారంభం చేసింది. -
నేను దోషిని కాదు
లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై స్థానిక దిల్లీ న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్పుత్ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. -
బెల్జియంతో అబ్బాయిలు.. అర్జెంటీనాతో అమ్మాయిలు
ప్రొ హాకీ లీగ్ ఐరోపా అంచెలో తలపడటానికి భారత హాకీ జట్లు సిద్ధమయ్యాయి. బుధవారం ఆతిథ్య బెల్జియంతో పురుషుల జట్టు.. అర్జెంటీనాతో మహిళల బృందం ఆడతాయి. ఈ లీగ్లో ప్రస్తుతం భారత్ (8 మ్యాచ్ల్లో 15 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. -
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆర్సీబీని.. ఓటములతో డీలాపడిన రాజస్థాన్ కీలక మ్యాచ్లో ఏమాత్రం అడ్డుకోగలదో చూడాలి.
తాజా వార్తలు (Latest News)
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?