పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు.
రాహుల్, రింకూలకు నిరాశ
దూబెకు అవకాశం
రిజర్వ్ జాబితాలో గిల్
టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ఎంపిక
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. కానీ.. ఎవరూ ఊహించనివిధంగా నయా ఫినిషర్ రింకూసింగ్పై వేటు పడింది. ఈసారి ఐపీఎల్లో నిలకడగా ఆడుతున్నప్పటికీ కేఎల్ రాహుల్కు నిరాశ తప్పలేదు.
దిల్లీ
టీమ్ఇండియా ఎంపికపై సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. టీ20 ప్రపంచకప్లో పోటీపడే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ముందే చెప్పినట్టుగా రోహిత్శర్మ జట్టును నడిపించనుండగా.. హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అహ్మదాబాద్లో బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన సమావేశమైన సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. పెద్దగా సంచలనాలు ఏమీ లేవుగానీ.. కొందరి ఉద్వాసన చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు.. అనుభవానికి పెద్దపీట వేశారు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్పై సెలెక్షన్ కమిటీ నమ్మకం ఉంచింది. అతడు ఫిట్నెస్తో పాటు ఫామ్ చాటుకోవడంతో.. ఇషాన్ కిషన్, జితేశ్ శర్మల పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కూ నిరాశే మిగిలింది. ఈసారి ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్న సంజు శాంసన్ను రెండో వికెట్కీపర్గా సెలక్టర్లు ఎంపిక చేశారు. ప్రపంచకప్లో ఆడనుండటం శాంసన్కు ఇదే తొలిసారి. రోహిత్తో కలిసి యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా బరిలో దిగనున్నాడు. ఐపీఎల్లో పెద్దగా పరుగులు చేయకపోయినా గిల్ను కాదని ఎడంచేతి వాటం ఆటగాడు యశస్విని సెలక్టర్లు తీసుకున్నారు. వెస్టిండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలం కావడంతో ఈసారి జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటు లభించింది. కుల్దీప్, స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ జట్టులో చోటు నిలబెట్టుకోగా.. ఫామ్లో ఉన్న యుజ్వేంద్ర చాహల్కూ సెలక్టర్లు అవకాశం కల్పించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదరగొడుతున్న శివమ్ దూబెకు సెలక్టర్లు చోటు కల్పించక తప్పలేదు. అతడి ఎంపికపై పెద్ద చర్చనే సాగిందని సమాచారం. హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, దూబెలలో ఇద్దరిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాగా.. సెలక్టర్లు రింకూను పక్కనపెట్టారు. ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా.. గత అనుభవం దృష్ట్యా సెలక్టర్లు పాండ్యకు చోటు కల్పించారు. జట్టులో స్థానంతో పాటు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టారు. అయితే ఒక స్పిన్నర్ను తగ్గించుకుని రింకూను ఎంపిక చేసే అవకాశమున్నా.. సెలక్టర్లు అతడిని పక్కన పెట్టేందుకే ఓటేశారు. పేసర్ల విషయంలో బుమ్రా, సిరాజ్ స్థానాలు ఖాయం కాగా.. మూడో స్థానాన్ని అర్ష్దీప్ దక్కించుకున్నాడు. శుభ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్, అవేష్ ఖాన్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. జూన్ 2న టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. జూన్ 5న న్యూయార్క్లో ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో భారత్ తన పోరాటాన్ని ప్రారంభిస్తుంది.
భారత జట్టు
రోహిత్ (కెప్టెన్), హార్దిక్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రిజర్వ్ ఆటగాళ్లు: శుబ్మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
నాకౌట్ దశలో తొలి మ్యాచ్ కోల్కతాతో తలపడేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ ఐపీఎల్ భవితవ్యంపై ఎవరికి తగ్గట్టుగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు దానిగురించి ధోనీ మాత్రం స్పందించలేదు. -
ఐపీఎల్ ప్లేఆఫ్స్ జట్లు.. ఈ కామన్ పాయింట్ గమనించారా?
PlayOffs Teams Names: ఐపీఎల్ 17వ సీజన్లో నాకౌట్ మ్యాచ్ల సందడి మొదలు కానుంది. దీనికి అర్హత సాధించిన నాలుగు జట్ల పేర్లు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. -
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు. -
కొత్త ప్రధాన కోచ్ పదవి రేసులో ఫ్లెమింగ్.. జయవర్థెనె? అతడికే ఎక్కువ ఛాన్స్!
భారత ప్రధాన కోచ్ పదవి రేసులో కొత్త పేర్లు చర్చకొస్తున్నాయి. అయితే, ఇప్పటికే బీసీసీఐ వర్గాలు చెన్నై కోచ్తో సంప్రదింపులు జరిపాయనే కథనాలూ వస్తున్నాయి. -
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్.. వర్షంతో రద్దైతే పరిస్థితేంటి? విజేత ఎవరు?
ఐపీఎల్ 2024 చివరి దశకు వర్షం ముప్పు ఎదురవుతోంది. లీగ్ స్టేజ్లో కోల్కతా - రాజస్థాన్ మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్కు ఇదే పరిస్థితి ఎదురైతే? అప్పుడు విజేతగా ఎవరిని ప్రకటిస్తారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి. -
అప్పుడు సెలక్టర్ కాళ్లు పట్టుకోలేదని.. జట్టులోకి ఎంపిక చేయలేదు: గంభీర్
ఐపీఎల్ 17వ సీజన్ తొలి క్వాలిఫయర్లో కోల్కతా - హైదరాబాద్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ మెంటార్ గంభీర్ తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విశేషాలను వెల్లడించాడు. -
తొలి అడుగు ఎవరిదో
రెండు జట్లూ పరుగుల వరద పారించాయి. రెండు జట్లలోనూ పవర్ హిట్టర్లున్నారు. హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా (20 పాయింట్లు), రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ (17 పాయింట్లు) మధ్య మంగళవారమే క్వాలిఫయర్-1. -
ఇది కోహ్లి రాసిన కథ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని ఓ నెల ముందు ఎంతమంది ఊహించివుంటారు..? బహుశా ఒక్కరూ ఉండరేమో! ఆ జట్టు ప్రదర్శన అలాంటిది మరి! ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. -
మన అమ్మాయి బంగారం
జపాన్లో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. మహిళల టీ20 400 మీటర్ల రేసు ఆరంభమైంది. నాలుగో లేన్లో పరుగు మొదలుపెట్టిన తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి ఆరంభంలో వెనుకబడింది. -
దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. -
జ్యోతి బృందానికి పసిడి
ఆసియా అథ్లెటిక్స్ రిలే ఛాంపియన్షిప్లో భారత 4×400 మీటర్ల మిక్స్డ్ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్ జ్యోతికశ్రీ దండి, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, శుభ వెంకటేశన్లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. -
మహి సరదాగా అలా
ఓటమి బాధను మర్చిపోవడానికి ఒక్కో ఆటగాడు ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటాడు. వేర్వేరు వ్యాపకాల్లో పడిపోతుంటారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని తనదైన శైల్లో ద్విచక్రవాహనంపై చక్కర్లు కొట్టాడు. -
సింధుకు పరీక్ష
పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ క్రీడాకారిణి పి.వి.సింధు మరో సవాల్కు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించాలని భావిస్తున్న సింధు మలేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. -
ఆసియా ఆర్చరీకి గణేశ్
దక్షిణ కొరియాలోని సువాన్లో జరిగే 2024 ఆర్చరీ ఆసియా కప్ పోటీలకు తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన తిరుమూరు గణేష్ మణిరత్నం ఎంపికయ్యాడు. -
ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదు
భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్ దగ్గరి దారి కాకూడదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ మార్గనిర్దేశకుడు గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నారు? -
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు ఆటగాడు యశ్ దయాల్ ఉత్తమ ప్రదర్శనతో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. గతేడాది ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు ఇచ్చి తీవ్ర విమర్శలపాలైన అతడు.. ఈ సారి వేలంపాటలోనూ ఆర్సీబీ తీసుకున్నందుకు విపరీతమైన ట్రోలింగ్కు గురయ్యాడు. -
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల మండిపడ్డాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనిపై ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్స్పోర్ట్స్ స్పందించింది. -
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ (MS Dhoni) దానికి శస్త్రచికిత్స చేయించుకోవడం కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
-
తొలి క్వాలిఫయర్.. అభిషేక్కు ఆ జోడీ నుంచే ముప్పు: భారత మాజీ క్రికెటర్
-
సిట్ నివేదికపై ఈసీ ఆదేశాలు వస్తే ఏం చేద్దాం?.. సీఎస్తో డీజీపీ భేటీ
-
రీకాల్, కోక్రియేట్ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్ కోపైలట్+ పీసీలు
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ