Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
పని ఒత్తిడి, గాయాల కారణంగా టీమ్ ఇండియాకు ఈ ఏడాది ఆరేడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్ : పని ఒత్తిడి, గాయాల కారణంగా టీమ్ ఇండియాకు ఈ ఏడాది ఆరేడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించాల్సి వచ్చింది. ఇలా ఎక్కువ మంది సారథులు లభించడంపై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. జట్టులో చాలా మంది నాయకులు ఉండటం ఎంతో అద్భుతంగా ఉందన్నారు. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్లాంటి వారు వైట్ బాల్ ఫార్మాట్లో భారత్ను నడిపించిన విషయం తెలిసిందే. జింబాబ్వేతో ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ధావన్ మరోసారి సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.
‘అలాంటి నాయకత్వం జట్టు కలిగి ఉండటం చాలా ముఖ్యమని నేను భావిస్తాను. మేం భారత టీ20 లీగ్ ఆడతాం. ఇది పది జట్ల టోర్నమెంట్. 10 మంది కెప్టెన్లు ఉంటారు. వారు ఏదో ఒక దశలో భారత జట్టులో కూడా భాగమవుతారు ’ అని రోహిత్ శర్మ ఓ క్రీడా ఛానల్తో మాట్లాడుతూ అన్నాడు.
‘మా వద్ద ఇలా ఎక్కువ మంది కెప్టెన్లు ఉండటం అద్భుతం. నిజాయతీగా చెప్పాలంటే.. ఈ కుర్రాళ్లు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకుంటుండంతో.. నా పని కూడా కాస్త తగ్గుతుంది. జట్టులో చాలా మంది సారథులను తయారుచేయడం.. ఎల్లప్పుడూ మంచి సంకేతమే. వారు జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు.. ఆటను అర్థం చేసుకోవడం, ఒత్తిడిని ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయి’ అని రోహిత్ వివరించాడు.
కెప్టెన్, కోచ్ల నుంచి సందేశం స్పష్టంగా ఉంటే.. ఆటగాళ్లు కూడా అలా చేయడానికి కచ్చితంగా ప్రయత్నిస్తారని రోహిత్ అన్నాడు. అలా జరగాలంటే వాళ్లకి స్వేచ్ఛ అవసరమని.. అందుకే వారికి వీలైనంత స్వేచ్ఛ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.
ఈ ఏడాదిలో టీమ్ ఇండియాకు ఇప్పటి వరకూ ఏడుగురు కెప్టెన్సీ బాధ్యతలు వహించారు. విరాట్ కోహ్లీ అనంతరం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్ల కెప్టెన్గా మారగా.. అతడు లేని సందర్భంలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, బుమ్రా, శిఖర్ ధావన్ జట్టుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్