Ruthuraj Gaikwad: ఒకే సీజన్లో నాలుగు శతకాలు.. కోహ్లీ సరసన రుతురాజ్
విజయ్ హాజారే ట్రోఫీలో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు నాలుగు శతకాలు నమోదు చేశాడు. దీంతో ఒకే సీజన్లో 4 సెంచరీలు..
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. మహారాష్ట్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు నాలుగు శతకాలు నమోదు చేశాడు. దీంతో ఒకే సీజన్లో 4 సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతని కంటే ముందు విరాట్ కోహ్లీ, పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్ ఈ ఘనత సాధించారు.
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించినా.. ప్రి క్వార్టర్ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. ‘ఎలైట్ గ్రూప్-డి’లో కేరళ, మధ్యప్రదేశ్ జట్లు మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. దీంతో మహారాష్ట్ర మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సింది. ఈ విషయంపై రుతురాజ్ స్పందిస్తూ.. ‘మేం ఆడిన ఐదు మ్యాచుల్లో.. నాలుగింట్లో విజయం సాధించినా ప్రి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించకపోవడంతో కొంచెం బాధగా ఉంది. వేరే గ్రూపుల్లో పలు జట్లు (హిమాచల్, విదర్భ, తమిళనాడు, కర్ణాటక) ఆడిన ఐదింట్లో రెండు మ్యాచులు ఓడిపోయిన తర్వాతి దశకు అర్హత సాధించాయి. క్రికెట్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంటుంది. అయినా మా జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది’ అని రుతురాజ్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తరఫున ఆడుతున్న రుతురాజ్.. గత సీజన్లో అత్యధిక పరుగులు (635) పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్న విషయం తెలిసిందే. గత కొద్దికాలంగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్న రుతురాజ్ను.. త్వరలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్కు ఎంపిక చేయాలని పలువురు మాజీ క్రికెటర్ల నుంచి సూచనలు వినిపిస్తున్నాయి.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం