BCCI: బీసీసీఐ అధ్యక్షుడి మార్పుపై రవిశాస్త్రి.. జీవితంలో ఏదీ శాశ్వతం కాదన్న మాజీ కోచ్!
బీసీసీఐకి కొత్త అధ్యక్షుడి రాక ఖరారైనట్టే. గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ వచ్చేస్తాడు. భారత్కు మొదటి వన్డే ప్రపంచకప్ అందించిన జట్టులో కీలక సభ్యుడు రోజర్ బిన్నీ. మరి తన పాత సహచరుడిని అధ్యక్ష స్థానంలో చూడనుండటంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. టీమ్ఇండియాకు తొలి ప్రపంచకప్ను అందించిన కపిల్ సేనలో కీలక సభ్యుడు, మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొత్త అధ్యక్షుడిగా రావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 18వ తేదీన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ప్రెసిడెంట్గా వద్దామని భావించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్ష పదవిపై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. 1983 ప్రపంచకప్ జట్టులో రోజర్ బిన్నీ, రవిశాస్త్రి సహచరులు కావడం విశేషం. రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడనే వార్తలను స్వాగతిస్తున్నట్లు రవిశాస్త్రి వెల్లడించాడు.
‘‘రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడిగా వస్తాడని ప్రచారం సాగుతోంది. నాకెంతో ఆనందంగా ఉంది. ప్రపంచకప్లో నా సహచరుడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం అతడికి ఉంది. ఇప్పుడు టాప్ పోస్టులోకి రాబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం.. బీసీసీఐ చరిత్రలో భారత్కు తొలి వన్డే ప్రపంచకప్ను అందించిన జట్టులోని సభ్యుడు బాస్గా రావడం అద్భుతం’’ అని తెలిపాడు. రోజర్ బిన్నీ మాత్రమే బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఏకగ్రీవంగాఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీ ఆశించినా.. ఇతర సభ్యుల నుంచి పెద్దగా మద్దతు లేకపోవడంతో విరమించుకొన్న విషయం తెలిసిందే. దానిపైనా రవిశాస్త్రి స్పందించాడు. ‘‘వరుసగా రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా అయినవారు ఎవరూ లేరు. ఇప్పుడు మరొక క్రికెటర్కు అవకాశం వచ్చిందనుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. కొంతకాలం కేటాయించిన విధులు నిర్వర్తించడమే మన బాధ్యత. ఆ తర్వాత ముందుకు సాగిపోవడమే జీవితం. ఇక రోజర్ బిన్నీ సామర్థ్యం ప్రశ్నించలేం. అంతేకాకుండా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో సభ్యుడు. అందుకే బీసీసీఐ అధ్యక్షుడిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. కేవలం అగ్రశ్రేణి ఆటగాళ్లను మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ప్రతి ప్లేయర్కు మంచి చేయగలడని భావిస్తున్నా. స్వతంత్రంగా పనిచేయగల సమర్థుడు. క్రికెట్కు సంబంధించిన అంశాలపై గట్టిగా మాట్లాడగలడు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు. క్రికెట్ మైదానల్లో మౌలిక సదుపాయాలు, వసతులు ఇంకా వృద్ధి చెందాలని ఆకాంక్షిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.