CWG 2022 : కామన్వెల్త్లో భారత్కు ఆరో స్వర్ణం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన...
ఇంటర్నెట్ డెస్క్: బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం చేరింది. దీంతో మొత్తం పతకాల సంఖ్య 20కి చేరింది. అందులో ఆరు బంగారు, ఏడు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల పారా హెవీ వెయిట్లిఫ్టింగ్ కేటగిరీలో సుధీర్ బంగారు పతకం సాధించాడు. కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించడం విశేషం. 134.5 పాయింట్లతో సుధీర్ గోల్డ్ గెలుచుకోగా.. నైజీరియాకి చెందిన క్రిస్టియన్ 133.6 పాయింట్లతో రజతం, ఇంగ్లాండ్ పారా వెయిట్లిఫ్టర్ మిక్కీ యులే కాంస్య పతకం దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన సుధీర్ తన రెండో విడతలో 212 కేజీలు ఎత్తేసి 134.5 పాయింట్లను సాధించాడు.
27 ఏళ్ల సుధీర్ ఆసియాన్ పారా గేమ్స్లో రజతం గెలిచాడు. ఇప్పుడు కామన్వెల్త్లో ఏకంగా స్వర్ణం సాధించడం విశేషం. గత జూన్లో దక్షిణ కొరియా వేదికగా జరిగిన వరల్డ్ పారా పవర్లిఫ్టింగ్ ఆసియా-ఓసియన్ ఓపెన్ ఛాంపియన్షిప్లో తన అత్యుత్తమం 214 కేజీలు ఎత్తి రజతం దక్కించుకున్నాడు. 2013లో సోనిపట్లో పవర్లిఫ్టింగ్ను కెరీర్గా ప్రారంభించాడు. సుధీర్ పతకం సాధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం