మధుమేహం ఉంటేనే అవగాహన కల్పించాలా?
క్రికెట్ స్థిత ప్రజ్ఞుడు అనిల్ కుంబ్లే ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. ఏదైనా వార్త కథనం ప్రచురించే ముందు సరిచూసుకోవాలని హితవు పలికారు. ఏదైనా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఆ వ్యాధిగ్రస్థుడే అవ్వాల్సిన పన్లేదని విమర్శించారు...
వాస్తవాలు తెలుసుకొని రాయాలని చురకలు
క్రికెట్ స్థిత ప్రజ్ఞుడు అనిల్ కుంబ్లే ఓ మీడియా సంస్థకు చురకలు అంటించారు. ఏదైనా వార్త కథనం ప్రచురించే ముందు సరిచూసుకోవాలని హితవు పలికారు. ఏదైనా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఆ వ్యాధిగ్రస్థుడే అవ్వాల్సిన పన్లేదని విమర్శించారు.
ఔట్లుక్ మ్యాగజైన్ మధుమేహం గురించి ఓ కథనం రాసింది. భారత దేశానికి డయాబెటిస్ ఎంత భారంగా మారిందో అందులో వివరించింది. జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే సమస్య సమసిపోతుందని వెల్లడించింది. మధుమేహంతో జీవిస్తున్న ప్రముఖులు వీరేనంటూ కొందరి చిత్రాలను ప్రచురించింది.
గౌరవ్ కపూర్, సోనమ్ కపూర్, కమల్ హాసన్, సుధా చంద్రన్, అరవింద్ కేజ్రీవాల్, వసీమ్ అక్రమ్, నిక్ జోనాస్, అనిల్ కుంబ్లే వంటి ప్రముఖులకు డయాబెటిస్ ఉందని ఔట్లుక్ ప్రచురించింది. దీనిపై అనిల్ కుంబ్లే అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఏదైనా ముద్రించే ముందు దయచేసి సరిచూసుకోండి. మధుమేహంపై అవగాహన కల్పించేందుకు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని చెప్పే వ్యక్తికి డయాబెటిస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా మధుమేహంతో బాధపడుతుంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం, నిరంతరం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది’ అని కుంబ్లే ట్వీట్ చేశారు. మధుమేహం గురించి ఆయన అనేక కార్యక్రమాల్లో అవగాహన కల్పిస్తుంటారు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం