Muralitharan: వీరూ 2 గంటల్లో 150, రోజంతా 300 పరుగులైనా చేసేస్తాడు..
పరుగుల రారాజు సచిన్ తెందూల్కర్కు బంతులు వేసేందుకు భయపడేవాడిని కాదని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. అతడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పేర్కొన్నాడు....
సచిన్కు ఆఫ్స్పిన్ బలహీనత..
దిల్లీ: పరుగుల రారాజు సచిన్ తెందూల్కర్కు బంతులు వేసేందుకు భయపడేవాడిని కాదని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అన్నాడు. అతడు ఎక్కువగా ఇబ్బంది పెట్టడని పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, బ్రయన్ లారా అయితే బంతిని చితకబాదేవారని వెల్లడించాడు. వారికి బౌలింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించేదని తెలిపాడు. ఈఎస్పీఎన్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు.
‘సచిన్కు బంతులేసేటప్పుడు భయం ఉండదు. ఎందుకంటే అతడెక్కువగా ఇబ్బంది పెట్టడు. అదే సెహ్వాగ్ అయితే గాయపరుస్తాడు. సచిన్ తన వికెట్ను కాపాడుకుంటాడు. బంతిని చక్కగా గమనించి ఆడతాడు. అతడికి టెక్నిక్ బాగా తెలుసు’ అని ముత్తయ్య అన్నాడు.
‘మాస్టర్కు ఆఫ్స్పిన్ ఆడటంలో కొద్దిగా బలహీనత ఉందని నేను గమనించాను. లెగ్స్పిన్ను అతడు బాదేసేవాడు. ఆఫ్స్పిన్లో మాత్రం కొద్దిగా తడబడేవాడు. అందుకే నేనతడిని చాలాసార్లు ఔట్ చేశాను. చాలామంది ఆఫ్ స్పిన్నర్లూ అతడిని ఔట్ చేయడం నేను చూశాను’ అని ముత్తయ్య తెలిపాడు.
‘ఎందుకో తెలియదు. నేనూ ఈ విషయం గురించి ఎప్పుడూ సచిన్తో చెప్పలేదు. అతడు ఆఫ్స్పిన్లో ఇబ్బంది పడతాడని నాకనిపించేది. అందుకే ఇతర ఆటగాళ్లతో పోలిస్తే నేను అతడిపై ఎక్కువ పైచేయి సాధించా. ఏదేమైనా సచిన్ గొప్ప ఆటగాడు. అతడిని ఔట్ చేయడం అంత సులభమైతే కాదు’ అని మురళీధరన్ అన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్, బ్రయన్ లారాకు బౌలింగ్ చేసేందుకు మాత్రం తాను భయపడేవాడినని ముత్తయ్య తెలిపాడు. ‘సెహ్వాగ్ అత్యంత ప్రమాదకారి. అతడి కోసం మేం డీప్లో, బౌండరీ సరిహద్దుల వద్ద ఫీల్డర్లను మోహరించేవాళ్లం. ఎందుకంటే అతడు అవకాశాలను వదులుకోడు. సహజశైలి ప్రకారం బంతిని బాదేస్తాడు. తనదైన రోజున ఎవరిపైనైనా దాడిచేస్తాను అన్నట్టుగా అతడి స్వభావం ఉండేది. అందుకే మేం అతడికి డిఫెన్సివ్ ఫీల్డింగ్ పెట్టి ఎప్పుడు పొరపాటు చేస్తాడా అని ఎదురు చూసేవాళ్లం’ అని మురళీధరన్ చెప్పాడు.
‘వీరేంద్ర సెహ్వాగ్లోని ప్రత్యేకత ఏంటంటే అతడు క్రీజులో రెండు గంటలు ఉంటే 150 రోజంతా ఆడితే 300 పరుగులు చేసేస్తాడు. అందుకే అలాంటి ఆటగాళ్లు ఎంతో ప్రమాదకరం’ అని ముత్తయ్య తెలిపాడు. ఇక ప్రస్తుత తరంలో తన బౌలింగ్ను విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ బాగా ఎదుర్కోగలరని అంచనా వేశాడు. వారిద్దరూ స్పిన్ను బాగా ఆడతారని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.