Michael Vaughan: టీమ్ఇండియానే అందరికన్నా ముందన్న దాదా.. కాదన్న వాన్
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్కు టీమ్ఇండియా విజయాలన్నా.. ప్రదర్శనలన్నా ఇంకా చిన్నచూపే! ఏదో ఒక రకంగా భారత్ను తక్కువ చేసేలా సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు....
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్కు టీమ్ఇండియా విజయాలన్నా.. ప్రదర్శనలన్నా ఇంకా చిన్నచూపే! ఏదో ఒక రకంగా భారత్ను తక్కువ చేసేలా సోషల్ మీడియాలో స్పందిస్తుంటాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని పరోక్షంగా ఎగతాళి చేస్తుంటాడు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీటుకు అతడు బదులివ్వడమూ అలాగే అనిపించింది!
ఓవల్ మైదానంలో టీమ్ఇండియా తిరుగులేని విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల తర్వాత భారత జట్టు అక్కడ విజయ ఢంకా మోగించింది. ఐదు టెస్టుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఖరిదైన మాంచెస్టర్ టెస్టులో కోహ్లీసేన ఓడిపోకపోతే.. ఆంగ్లేయులపై సిరీసు సొంతమవుతుంది. కాగా ఓవల్ విజయం తర్వాత టీమ్ఇండియాపై ప్రశంసల జల్లు కురిసింది.
ఇందులో భాగంగానే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత జట్టును అభినందించాడు. ‘అద్భుత ప్రదర్శన.. రెండు జట్ల మధ్య నైపుణ్యమే తేడా. అంతకు మించిన తేడా ఏంటంటే టన్నుల కొద్దీ ఒత్తిడిని అధిగమించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే భారత క్రికెట్ మరెంతో ముందుంది’ అని దాదా ట్వీట్ చేశాడు. దానికి వాన్ కవ్విస్తున్నట్టుగా బదులిచ్చాడు. ‘టెస్టు క్రికెట్లో మాత్రమే.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనైతే కాదు’ అని సమాధానం ఇచ్చాడు.
ఇంగ్లాండ్ పిచ్లపై టీమ్ఇండియా ఆడలేదని.. స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోలేక కుప్పకూలుతుందని మైకేల్ వాన్ గతంలో అన్నాడు. అలా జరిగినప్పటికీ భారత్ పుంజుకొని విజయాలు సాధించింది. దాంతో ఓవల్ టెస్టు గెలుపు తర్వాత కోహ్లీసేనను వాన్ ప్రశంసించక తప్పలేదు.
‘ఐదు రోజుల క్రికెట్ గొప్పదనమే ఇది.. టీమ్ఇండియా అన్నింటా బలంగా కనిపించింది. ఆట మధ్యలో విరాట్ కోహ్లీ తెలివైన నిర్ణయాలు తీసుకున్నాడని అనిపించింది. దాంతో జట్టు ఆధిపత్యం చలాయించింది. ఐదో రోజు ఉదయం ఎలా బౌలింగ్ చేయాలో అలాగే చేశారు. రివర్స్ స్వింగ్ను రాబట్టారు’ అని అతడు ట్వీటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.