Pakistan Cricket: న్యూజిలాండ్ జట్టు వెళ్లిపోవడానికి భారత్ కారణమట!
పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మ్యాచ్లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భారత్లో రూపొందిన ఈ మెయిల్ ద్వారానే ఆ జట్టుకు బెదిరింపులు వచ్చాయని పాక్ మంత్రి అసత్య ప్రచారం మొదలుపెట్టారు.
మరోసారి భారత్పై విషం గక్కిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తమ దేశంలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మ్యాచ్లు రద్దు చేసుకొని వెళ్లిపోవడానికి భారత్ కారణమంటూ నెపం మోపింది. భద్రతా కారణాలతో కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్లను రద్దు చేసుకొని న్యూజిలాండ్ స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
2009లో లాహోర్లోని గదాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్కు అంతర్జాతీయ జట్లు వెళ్లడం మానేశాయి. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ నిర్ణయంతో దాయాది దేశానికి గట్టి షాక్ తగిలింది. అందుకు భారత్ కారణమంటూ పాక్ తాజాగా ఆరోపణలకు దిగింది. భారత్లో జనరేట్ అయిన ఈ మెయిల్ నుంచి ఆ జట్టుకు బెదిరింపులు వచ్చాయని ఆ దేశ ఐటీ శాఖ మంత్రి ఫవాద్ చౌధరీ నిందారోపణలు చేశారు.
దీనికి సంబంధించి పాక్ మంత్రులు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. తెహ్రీక్-ఇ-తాలిబన్ పేరిట వచ్చిన నకిలీ పోస్టుతో అసలు వ్యవహారం ప్రారంభమైందన్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందని పాకిస్థాన్కు జట్టును పంపొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆ ట్విటర్ ఖాతా సూచించిందని, ఈ పోస్టు తర్వాత భారత్కు చెందిన ఓ పత్రికలో ఉగ్రముప్పుపై వచ్చిన ట్వీట్ను ఉటంకిస్తూ కథనం వెలువడిందని పాక్ మంత్రులు ఆరోపించారు. భారత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రికి ఆ మీడియా సంస్థతో సంబంధాలున్నాయన్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ క్రికెటర్ భార్యకు బెదిరింపు మెయిల్ వెళ్లిందని చెప్పుకొచ్చారు. ఏ సోషల్ మీడియా ఖాతాతో దానికి సంబంధం లేదని, ఒక సెక్యూర్ ఖాతా నుంచి ఆ ఒక్క మెయిల్ మాత్రమే వచ్చిందన్నారు. దాని పూర్వాపరాలు వెలికితీసేందుకు ఇంటర్పోల్ సహకారాన్ని కూడా అభ్యర్థించామన్నారు. అప్పటికీ న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి, ఏ ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ కూడా చేసిందని గుర్తుచేశారు.
అయితే మ్యాచ్ మొదటి రోజున తమ జట్టుకు ముప్పు ఉందని చెప్పి, హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయిందని మంత్రులు అన్నారు. బెదిరింపులకు సంబంధించిన వివరాలు చెప్పాలని కోరినప్పటికీ.. చెప్పలేకపోయారన్నారు. తర్వాత రోజు న్యూజిలాండ్ జట్టుకు రెండో బెదిరింపు మెయిల్ వెళ్లిందన్నారు. అది భారతదేశానికి చెందిన పరికరం నుంచి పంపినట్లు గుర్తించామని పేర్కొన్నారు. దాని లొకేషన్ సింగపూర్గా చూపిందన్నారు. మొత్తానికి ఈ బెదిరింపులు భారత్ నుంచి జనరేట్ అయ్యాయని మీడియా సమావేశంలో మంత్రులు నిందలు వేశారు. అలాగే డిసెంబర్లో పాక్లో పర్యటించనున్న వెస్టిండీస్ జట్టుకు కూడా ఇప్పటికే బెదిరింపులు వెళ్లాయని చెప్పారు. న్యూజిలాండ్ జట్టుకు తెలిసిన వివరాలు తమతో పంచుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు