IND vs SA : సిరీస్ విజయ సమీకరణం 8 వికెట్లు.. 111 పరుగులు
నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా...
భారత్ రెండో ఇన్నింగ్స్ 198/10
దక్షిణాఫ్రికా లక్ష్యం 212.. ప్రస్తుతం 101/2
ఇంటర్నెట్ డెస్క్: నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. అయితే విజయం సాధించే అవకాశాలు ఆతిథ్య జట్టువైపే ఉన్నట్లుగా కనబడుతోంది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 111 పరుగులు చేయాలి.. భారత్ ఎనిమిది వికెట్లను పడగొట్టాలి. మరోవైపు పీటర్సన్ (48 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా పీటర్సన్-ఎల్గర్ (30) జోడీ వికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఎట్టకేలకు బుమ్రా బౌలింగ్లో డీన్ ఎల్గర్ (30) వికెట్ దొరకడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఓపెనర్ మార్క్రమ్ (16) విఫలమయ్యాడు. టీమ్ఇండియా బౌలర్లు షమీ, బుమ్రా చెరో వికెట్ తీశారు. రేపు తొలి సెషన్లో వికెట్లను తీసినదానిని బట్టి విజయం ఖరారవుతుంది.
ఒకే ఒక్కడు.. పంత్
భారత్ రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకు ఆలౌటైంది. ఈ మాత్రం స్కోరు చేసిందంటే ప్రధాన కారణం రిషభ్ పంత్ (100*). అద్భుతమైన శతకం సాధించి జట్టు ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. పంత్ కాకుండా విరాట్ కోహ్లీ (29) కాస్త ఫర్వాలేదనిపించాడు. మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 4, రబాడ 3, ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్: భారత్ 223/10.. దక్షిణాఫ్రికా 210/10
రెండో ఇన్నింగ్స్: భారత్ 198/10.. దక్షిణాఫ్రికా 101/2 (29.4 ఓవర్లు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు