మన క్రికెటర్లూ ఆహార ప్రియులే..!
ఫిట్గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. ...
చిత్రం: అధికారిక ట్విటర్ ఖాతా నుంచి..
ఇంటర్నెట్ డెస్క్: ఫిట్గా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి. అందులోనూ ఓ క్రికెటర్ అయితే.. ప్రత్యేక డైట్ పాటించాల్సిందే. కసరత్తులు చేస్తూ ఫిట్గా తయారవ్వాల్సిందే. కానీ ఎంత ఫిట్గా తయారైనా.. ఎంతటి డైట్ పాటించినా.. వీలుచిక్కినపుడు డైట్కి కాస్త కామా పెట్టి నచ్చింది లాగించేస్తారు. అలా మన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఇష్టపడే ఆహారం ఏంటి? వారు మెచ్చిన ఆహార పదార్థాలేంటి? ఓ లుక్కేయండి.
విరాట్ కోహ్లీ
భారత జట్టులో ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్ కెప్టెన్ కోహ్లీ. ఎంతో మంది యువ క్రికెటర్లు విరాట్ని చూసి ఫిట్నెస్లో ప్రేరణ పొందుతుంటారు. చిన్నతనంలో నూడుల్స్, పఫ్స్ వంటి చిరుతిళ్లు ఇష్టంగా తినే ఈ దిల్లీ కుర్రాడు గత ఎనిమిదేళ్లుగా వాటన్నిటినీ తినడం తగ్గించాడు. రోజూ రెండు గంటలు జిమ్, ప్రత్యేక డైట్ ఫాలో అవుతున్నాడు. కానీ విరాట్కి జపనీస్ ఆహారమంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ‘సుశి’ అనే వంటకాన్ని వీలు చిక్కినప్పుడల్లా లాగించేస్తాడు. ‘ఆలూ పరాఠా, చోలే భటూరే’ తదితర పంజాబీ వంటకాలన్నా తనకి మహా ఇష్టం.
ఎం.ఎస్ ధోనీ
బేసిక్గా మన మాజీ భారత క్రికెట్ జట్టు సారథి ఆహార ప్రియుడు. సమయం దొరికితే చాలు డైట్ కాస్త పక్కన పెట్టి నచ్చిన ఆహారం లాగిస్తాడు. ధోనీకి చికెన్తో చేసిన వంటకాలంటే చాలా ఇష్టం. చికెన్ కబాబ్స్, చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా.. ఇలా చికెన్తో తయారైన ఏ వంటనైనా ఇష్టంగా తింటాడంటారు. ఓసారి ధోనీ ట్విటర్ బయోపై ఓ లుక్కేయండి. ఎప్పటికీ ‘హంగ్రీ ఫర్ చికెన్ బటర్ మసాలా’ అని రాసుకొచ్చాడు. హల్వా, కీర్ వంటి తియ్యని పదార్థాలనీ ఇష్టంగా తింటాడు.
రోహిత్ శర్మ
ఈ ముంబయి ఇండియన్సు కెప్టెన్కి వడపావ్, పావ్భాజీ అంటే చాలా ఇష్టం. రోహిత్ ఏం తీసుకుంటావ్... అని ఎవరైనా అడిగితే చటుక్కున ‘ఆలూ పరాఠా... ఆలూ పరాఠా’ అని బదులిస్తాడు. చైనీస్ వంటకాలపైనా మక్కువ చూపుతాడు. తన డైట్లో భాగంగా కోడిగుడ్లను ఎక్కువగా తీసుకుంటాడు.
కే.ఎల్ రాహుల్
ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకుంటే చాలు, పరుగుల వరద పారించే యువ క్రికెటర్ కే.ఎల్ రాహుల్. ఫిట్నెస్కి చాలా ప్రాధ్యానం ఇస్తాడీ కర్ణాటక కుర్రాడు. చిరుతిళ్లు, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాల వైపు అసలే చూడడు. కానీ జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. తీరిక దొరికితే రుచిరుచిగా ఉండే జపనీస్ ఫుడ్ తినేందుకు ఉవ్విళ్లూరుతాడు. చేపలు, పీతల వంటి సీఫుడ్ అంటే ఇష్టపడతాడు. రకరకాల రుచుల్లోని దోశలన్నా తనకిష్టమే.
రిషబ్ పంత్
యుజ్వేంద్ర చాహల్ మాటల ప్రకారం భారత క్రికెట్ జట్టులో అత్యధిక ఆహార ప్రియుడు రిషబ్ పంత్. ముందుంది శాకాహారమైనా, మాంసాహారమైనా ఇష్టంగా లాగించేయడమే పంత్ పనంట. టేబుల్ మీద పది వంటకాలుంటే అన్నింటినీ రుచి చూసేవరకు టేబుల్పై నుంచి కదలడట పంత్. ఆలూ పరాఠ అంటే పంత్కి చాలా ఇష్టమంటా. చోలే భటూరే అనే ఆహారాన్ని ఇష్టంగా లాగించేస్తాడంట ఈ యువ వికెట్ కీపర్. ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా.. చివరికి ఐస్క్రీంని రుచి చూడనిదే టేబుల్ నుంచి కదలడంట ఈ డైనమిక్ ప్లేయర్.
యుజ్వేంద్ర చాహల్
స్పిన్ అస్త్రాలు సంధిస్తూ, చిచ్చర పిడుగులా వికెట్లు తీస్తూ... ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే చాహల్ ఆహారానికి అధిక పాధాన్యతనిస్తాడు. బటర్ చికెన్ అంటే తనకెంతో ఇష్టం. దేశీయ వంటకాలన్నా మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఉత్తర భారత వంటకాలని చాలా ఇష్టంగా ఆరగిస్తాడు. చోలే కుల్చే, పానీ పూరీ, దాల్ తడ్కా, రాజ్మా చావల్ వంటి ఆహార పదార్థాలని ఇష్టంగా లాగించేస్తాడు. గ్రీన్ చట్నీ అంటే చాహల్కి చాలా ఇష్టం.
జస్ప్రీత్ బుమ్రా
మెరుపు వేగంతో యార్కర్లు వేసే బుమ్రా ఫిట్నెస్ ప్రియుడు. బయటి ఆహారం, చిరుతిళ్ల జోలికి పోడు. ఖాళీ సమయాల్లోనూ తనదైన ప్రొటీన్తో కూడిన డైట్నే పాటిస్తాడు. ఎక్కువగా ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యతనిస్తాడు. గుజరాతీ వంటకం ధోక్లా తన ఫేవరిట్. సోన్పాపిడీ, గులాబ్జామ్ ఇష్టంగా తింటాడు. చికెన్తో చేసిన వంటకాలన్నా ఇష్టపడతాడు. చికెన్ బటర్ మసాలా, చికెన్ టిక్కా పిజ్జా, కబాబ్తో పాటు చేపలని ఇష్టంగా లాగించేస్తాడు.
భువనేశ్వర్ కుమార్
భువనేశ్వర్కి తీపి పదార్థాలంటే మక్కువ. ‘నాకు తీపి దంతాలు కూడా ఉన్నాయండీ’ అంటాడు ఈ పేస్ వీరుడు. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అసలు డైటే పాటించని భువి ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక డైట్ని ఫాలో అవుతున్నాడు. ఫిట్నెస్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడు. భోజనంలో ఎక్కువగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. ఇంటి వంటకే ప్రాధాన్యతనిస్తాడు. ‘కది చావల్’ అంటే భువికి చాలా ఇష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గెలిచినా.. ఓడినా పాక్ ఫ్యాన్స్ దృష్టంతా మనమీదే: యువరాజ్ సింగ్
టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ప్రయాణం జూన్ 5న ప్రారంభం కానుంది. ఆ రోజే ఐర్లాండ్తో తలపడనుంది. ఇక జూన్ 9న దాయాది దేశం పాక్ను ఢీకొట్టనుంది. -
ఒమన్పై నమీబియా ‘సూపర్’ ఓవర్ విక్టరీ
ప్రపంచ కప్ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. తాజాగా నమీబియా తొలి విజయాన్ని ‘సూపర్’ ఓవర్లో నమోదు చేసింది. -
న్యూయార్క్ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్
మరో రెండు రోజుల్లో భారత జట్టు ప్రపంచ కప్ సంగ్రామంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వార్మప్లో సత్తా చాటిన ఆటగాళ్లు సమరోత్సాహంతో ఉన్నారు. -
ప్రపంచ కప్ను చూడాలని లేదు..: రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
తనకు జాతీయ జట్టులో స్థానం దక్కలేదని రియాన్ పరాగ్ అసంతృప్తిని తెలిపే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసి నెట్టింట విమర్శలకు గురవుతున్నాడు. -
వరల్డ్ కప్ జట్టు ప్రకటనకు ముందు.. తర్వాత మన బ్యాటర్ల ఆట తీరిదీ!
టీమ్ఇండియా జూన్ 5న టీ20 ప్రపంచ కప్లో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వార్మప్ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. మరి ఆటగాళ్ల ఫామ్ను ఓ సారి పరిశీలిద్దాం. -
ప్రజ్ఞానంద తగ్గేదేలే.. ఈసారి రెండో ర్యాంకర్కు షాక్
నార్వే చెస్ టోర్నీలో భారత సంచలన ఆటగాడు ప్రజ్ఞానంద ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. -
భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతా: గౌతమ్ గంభీర్
భారత జట్టుకు కోచ్ కావడాన్ని ఇష్టపడతానని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ అన్నాడు. -
కూనపై కష్టంగా..
పాపువా న్యూగినీ. క్రికెట్లో పసికూన. ప్రపంచకప్కు అర్హత సాధించినా.. ఎవరూ ఆ జట్టును లెక్కలోకే తీసుకోలేదు. కానీ న్యూగినీ ఆకట్టుకుంది. -
అమెరికా అదరహో
అమెరికా.. టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశాల్లో ఒకటి. క్రికెట్ అంటే పెద్దగా ఆదరణ లేని ఆ దేశంలో ఈ టోర్నీతో ఆటకు ఊపొస్తుందని అంచనా వేస్తుండగా.. ఆ ఆశలకు ఆయువు పోస్తూ టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే యుఎస్ జట్టు అదరగొట్టింది. -
క్యాన్సర్ను దాటి కప్పులో..
అది 2021 టీ20 ప్రపంచకప్కు ముందు రోజులు. చీలమండ క్యాన్సర్కు అతని స్నేహితుడు బలైపోయాడు. అప్పుడే తనకూ అదే వ్యాధి ఉందని తేలింది. -
స్వైటెక్ ఫటాఫట్
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో హ్యాట్రిక్ టైటిల్పై కన్నేసిన స్వైటెక్ మరో అడుగు ముందుకేసింది. -
అమిత్, జైస్మిన్లకు పారిస్ బెర్తులు
భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ ఫంగాల్, జైస్మిన్ లాంబోరియా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. -
సంక్షిప్త వార్తలు
టీ20 ప్రపంచకప్లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ను ఖరారు చేయలేదని కెప్టెన్ రోహిత్శర్మ అన్నాడు. -
టీ20 ప్రపంచకప్.. పసికూనపై చెమటోడ్చి నెగ్గిన విండీస్
టీ20 ప్రపంచకప్లో భాగంగా గ్రూప్ సిలో పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
భారత్తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
టీమ్ఇండియాతో జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ స్పందించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మతో కలిసి ఎవరు ఓపెనింగ్ చేయాలనే దానిపై సునీల్ గావస్కర్ స్పందించాడు.
తాజా వార్తలు (Latest News)
-
దొంగతనానికి వచ్చి.. నిద్రలోకి జారుకొని..!
-
ఎగ్జిట్ పోల్స్కు మించి కూటమి ఘన విజయం: మాజీ మంత్రి గంటా
-
గెలిచినా.. ఓడినా పాక్ ఫ్యాన్స్ దృష్టంతా మనమీదే: యువరాజ్ సింగ్
-
జూన్ 4 వరకు ఆగండి.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారే: సోనియాగాంధీ
-
64.2 కోట్ల మంది ఓటేశారు.. ప్రపంచ రికార్డు సృష్టించామన్న ఈసీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM