Under 19 World Cup: ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన యువభారత్
అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది
ఇంటర్నెట్ డెస్క్: అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్ పోరులో ఇంగ్లాండ్తో తలపడడమే తరువాయి. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తొలుత భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబాటుకు గురైంది. 40 ఓవర్లకు భారత్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు. అయితే చివరి పది ఓవర్లలో భారత ఆటగాళ్లు 108 పరుగులు చేసి ఊహించని లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ 6, హర్నూర్ సింగ్ 16 తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ కెప్టెన్ యశ్ ధూల్ (110: 10 ఫోర్లు, ఒక సిక్స్), వైస్ కెప్టెన్, ఆంధ్రా కుర్రాడు షేక్ రషీద్(94: 8 ఫోర్లు, ఒక సిక్స్) నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు. మూడో వికెట్కు వీరిద్దరూ 204 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మూడు పరుగులకే తొలి వికెట్ సమర్పించుకున్న ఆజట్టు ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్ను నిర్మించింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న కోరె మిల్లర్(38), క్యాంప్బెల్(30)జోడిని రఘువంశీ విడగొట్టాడు. దీంతో 71 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే 73 పరుగుల వద్ద మూడో వికెట్గా క్యాంప్బెల్ ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం ప్రారంభమైంది. క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో 125 పరుగులకే ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మిగతా బ్యాట్స్మెన్ వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించారు. భారత బౌలర్లలో ఓస్వాల్ మూడు, నిషాంత్ సింధు, రవికుమార్ తలో రెండు వికెట్లు తీశారు. శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ యశ్ ధూల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.