Vinesh Phogat: ప్రపంచ ఛాంపియన్షిప్స్లో చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
కామన్వెల్త్ 2022 స్వర్ణపతక విజేత, భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత్ తరఫున రెండు కాంస్య పతకాలు నెగ్గిన తొలి రెజ్లర్గా రికార్డు నెలకొల్పింది.
బెల్గ్రేడ్: కామన్వెల్త్ 2022 స్వర్ణపతక విజేత, భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో భారత్ తరఫున రెండు కాంస్య పతకాలు నెగ్గిన తొలి రెజ్లర్గా రికార్డు నెలకొల్పింది. బెల్గ్రేడ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్స్ పోటీల్లో 53 కిలోల విభాగంలో తలపడ్డ వినేశ్ ఫొగాట్ స్వీడన్ రెజ్లర్ ఎమ్మా జొనాను 8-0 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 2019 కజఖిస్థాన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్స్లో తొలిసారిగా 28 ఏళ్ల వినేశ్ కాంస్యం సాధించింది. దీంతో ప్రపంచ ఛాంపియన్షిప్స్లో భారత్ తరఫున వినేశ్ రెండు పతకాలు సాధించి తన పేర కొత్త చరిత్ర రాసుకుంది.
క్వాలిఫికేషన్ రౌండ్లో మంగోలియా రెజ్లర్ ఖులాన్ బత్కుయాగ్ చేతిలో ఏ మాత్రం పోటీ ఇవ్వలేక 7-0 తేడాతో పరాజయం పాలైన వినేశ్.. కాంస్య పతక పోరులో అనూహ్యరీతిలో చెలరేగి గొప్ప విజయం సాధించింది. ఖులాన్ బత్కుయాగ్ ఫైనల్కు చేరుకోవడంతో వినేశ్ రెపిచేజ్ రౌండ్కు అర్హత సాధించింది. ఈ రౌండ్లో తొలుత కజఖ్స్థాన్ రెజ్లర్ జుల్డిజ్ ఎషిమోవాను 4-0తో ఓడించింది. అయితే తర్వాతి రౌండ్లో అజర్బైజన్ రెజ్లర్ లేలా గుర్బనోవా గాయం కారణంగా పాల్గొనకపోవడంతో వినేశ్ కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. దీంతో ఈ రౌండ్లో గొప్ప పోటీ ఇచ్చి విజయం సాధించింది. వినేశ్ కామన్వెల్త్ పోటీల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.