IND vs NZ: సిరీస్ క్లీన్స్వీప్పై కన్ను.. మైలురాళ్లకు చేరువగా భారత స్టార్ ఆటగాళ్లు
న్యూజిలాండ్తో (IND vs NZ) మూడో వన్డే ఆడేందుకు టీమ్ఇండియా (Team India) సిద్ధమైంది. క్లీన్స్వీప్ చేసేందుకు సమాయత్తమైంది. ఈ సందర్భంగా పలు రికార్డులపై భారత ఆటగాళ్లు గురి పెట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకొన్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్లోనూ విజయం సాధించి క్లీన్స్వీప్ చేయాలని టీమ్ఇండియా ఎదురు చూస్తోంది. తొలి వన్డేలో బ్యాటింగ్లో అదరగొట్టగా.. రెండో మ్యాచ్లో బౌలింగ్తో కివీస్ను భారత్ బెంబేలెత్తించింది. అయితే మూడో వన్డేలోనూ టీమ్ఇండియా విజయం సాధిస్తే మాత్రం ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకొనేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు మూడో స్థానంలో ఉన్న భారత్.. సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే నంబర్వన్ ర్యాంక్కు చేరుతుంది.
వారిద్దరికి అవకాశం ఉందా..?
రెండు వన్డేల్లోనూ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్కు తుది జట్టులో స్థానం దక్కలేదు. దీంతో సిరీస్ ఫలితానికి సంబంధం లేని నామమాత్రమైన మ్యాచ్లోనైనా వీరిద్దరికి చోటు కల్పిస్తుందో లేదో వేచి చూడాలి. సిరాజ్, షమీలో ఒకరికి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అయితే షమీకి గత మ్యాచ్లో చేతివేలికి గాయమైనప్పటికీ అలాగే బౌలింగ్ చేశాడు. దీంతో అతడిని పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు.
రోహిత్ 10 ఏళ్లు.. సచిన్ రికార్డుపై కోహ్లీ
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను అందుకోనున్నారు. ఓపెనర్గా రోహిత్ 10 ఏళ్లను పూర్తి చేసుకొన్నాడు. అదే విధంగా వన్డేల్లో నంబర్ వన్ ర్యాంక్ జట్టును క్లీన్స్వీప్ చేసే అవకాశం భారత్కు వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఓ రికార్డుపై కన్నేశాడు. ఇంతకీ అది క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డు కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో అర్ధశతకం సాధిస్తే మాత్రం న్యూజిలాండ్పై ఎక్కువ హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్గా మారతాడు. ప్రస్తుతం విరాట్, సచిన్ పదమూడేసి అర్ధశతకాలతో ఉన్నారు. సెంచరీ సాధిస్తే మాత్రం కివీస్పై ఎక్కువ శతకాలు సాధించిన బ్యాటర్గానూ వీరేంద్ర సెహ్వాగ్ (6)తో సమంగా విరాట్ కోహ్లీ (5) నిలుస్తాడు.
తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, చాహల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.