Virat Kohli: గంభీర్తో హగ్.. పాపం కొందరికి నచ్చలేదు: విరాట్ కోహ్లీ
ముంబయితో తలపడేందుకు బెంగళూరు సిద్ధమవుతోంది. ఓ కార్యక్రమంలో బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలో గంభీర్తో జరిగిన వాగ్వాదం తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు జట్టులో అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా అతడే. ఇవాళ ముంబయితో వాంఖడే స్టేడియం వేదికగా బెంగళూరు తలపడనుంది. ఈసందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో గౌతమ్ గంభీర్తో (Gautam Gambhir) వాగ్వాదం, ఆ తర్వాత కరచాలనంతోపాటు హగ్ చేసుకోవడం వంటి అంశాలపైనా స్పందించాడు.
‘‘అభిమానుల్లో కొందరు నేను అలా ప్రవర్తించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. నవీనుల్, గౌతమ్భాయ్ను నేను హగ్ చేసుకోవడం వారికి నచ్చలేదు. ఎందుకంటే వారి చర్చల్లో మసాలా లేకుండాపోయింది. వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా నేను, నవీనుల్ హక్ సరదాగానే మాట్లాడుకున్నాం. ‘త్వరగా ఫినిష్ చేసేయ్’ అని అతడు అన్నాడు. నేను కూడా ‘చేసేద్దాం’ అని నవ్వుకున్నాం. మ్యాచ్ ముగిశాక హగ్ చేసుకున్నాం’’ అని విరాట్ గుర్తు చేసుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో కోహ్లీ - నవీనుల్ హక్ - గంభీర్ ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అదే ఎడిషన్ తర్వాత బెంగళూరు - లఖ్నవూ తలపడినప్పుడు ఇద్దరూ కరచాలనం చేసుకొని ఆ వివాదానికి ముగింపు పలికారు. ఈసారి కూడా ఎలాంటి వివాదం లేకుండా ఐపీఎల్ సాగుతోంది.
కోహ్లీపైనే మొత్తం భారం: సిద్ధూ
‘‘ఈ ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఒంటరి యోధుడు. అయితే, అతడి వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే బెంగళూరు విజయం సాధించడానికి సరిపోదు. రాజస్థాన్ జట్టు మాదిరిగా ప్రతిఒక్కరూ భాగస్వామ్యం అందించాలి. ఆర్సీబీలోని బ్యాటర్లు, బౌలర్లు పుంజుకోవాల్సిన సమయమిదే. సచిన్, సునీల్ గావస్కర్ అయినా ఒంటరిగానే జట్టును గెలిపించలేదు. స్పిన్ బౌలింగ్లో బెంగళూరు బలహీనంగా ఉంది. గతంలో హసరంగ ఉండేవాడు. అతడిని తీసుకోలేదు. దీంతో జట్టు వేలం వ్యూహం ఏంటనేది ప్రశ్నగా మారింది. భారీ హిట్టర్లనే కాకుండా బౌలింగ్ విభాగంపైనా దృష్టిపెడితే బాగుండేది’’ అని భారత మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సిద్ధూ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
-
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?