Virat Kohli: ఆ ‘82’ కంటే.. ఈ ‘82’ బెస్ట్..: విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్ను భారత్ విజయంతో ఆరంభించింది. పాకిస్థాన్ మీద నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. విరాట్ కోహ్లీ అర్ధశతకం సాధించి కీలక పాత్ర పోషించాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ అద్భుత విజయం సాధించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ (82*:53 బంతుల్లో 6X4, 4X6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్య (40)తో కలిసి శతక భాగస్వామ్యం నిర్మించాడు. ఓడిపోతామనుకొన్న మ్యాచ్ను చివరి వరకూ క్రీజ్లో నిలబడి గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా విరాట్ అవార్డు అందుకొన్నాడు.
ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ఇదొక అద్భుతమైన వాతావరణం. ఇలాంటి సమయంలో మాటలు రావడం లేదు. ఇది ఎలా జరిగిందో ఐడియా రావడం లేదు. ఎందుకంటే నేను పదాలు మరిచిపోయా. మనం సాధించగలమని హార్దిక్ నమ్మాడు. చివర వరకూ క్రీజ్లో ఉంటే సాధ్యమేనని అనుకొన్నాం. పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసిన షహీన్ షా అఫ్రిదిని టార్గెట్ చేయాలని భావించాం. అలాగే హారిస్ రవుఫ్ వారికి చాలా కీలక బౌలర్. ఒక్కసారి హారిస్ను ఎటాక్ చేస్తే తప్పకుండా పాక్ ఒత్తిడికి గురి అవుతుందని తెలుసు. చివరి ఓవర్ నవాజ్ వేస్తాడు ముందే అనుకొన్నాం. 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన తరుణంలో రెండు సిక్స్లు కొట్టడం తేలిక చేసింది. మరీ ముఖ్యంగా చివరి బంతికి సిక్సర్ వెళ్లడం నిజంగా అద్భుతమే. దీంతో 6 బంతుల్లో లక్ష్యం 16కి వచ్చింది. నా శక్తిసామర్థ్యం మీద నమ్మకం ఉంచా. ఇప్పటి వరకు మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా మీద ఆడిన ఇన్నింగ్స్ నా అత్యుత్తమంగా ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలోకి తాజా ఇన్నింగ్స్ వచ్చి చేరింది. హార్దిక్ చాలా మద్దతుగా నిలిచాడు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం అద్భుతం. మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.’’ అని తెలిపాడు. 2016 టీ20 ప్రపంచకప్లో మొహాలీ వేదికగా జరిగిన ఆసీస్పై 161 పరుగుల లక్ష్య ఛేదనలోనూ విరాట్ (82*: 51 బంతుల్లో 9X4,2X6) ఇలాంటి సూపర్ ఇన్నింగ్స్ను ఆడి భారత్ను గెలిపించాడు.
‘‘నేను చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీని చూస్తున్నా. కానీ, ఎప్పుడూ కంటితడి చూడలేదు. తొలిసారి పాక్ మీద విజయం తర్వాత ఇవాళ చూశా. ఇది ఎప్పటికీ మరువలేని సంఘటన’’ హర్షా భోగ్లే వ్యాఖ్యలు.. పాక్ మీద అపూర్వ విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ కళ్లు చెమర్చాయి. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో చాలా కీలక ఇన్నింగ్స్లు ఆడిన విరాట్పై ఫామ్పై ప్రశ్నలు వస్తూనే ఉన్న నేపథ్యంలో.. ఇలా బాధ బయటకు వచ్చినట్లు అభిమానులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.