Team India: ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో ముగ్గురు టీమ్‌ఇండియా క్రికెటర్లు.. లిస్ట్‌లో ఉన్నది వీరే

ప్రతిష్ఠాత్మక వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు రేసు (ICC Mens ODI Cricketer of Year 2023)లో నిలిచిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ (ICC) గురువారం విడుదల చేసింది.

Published : 04 Jan 2024 21:48 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డు రేసు (ICC Mens ODI Cricketer of Year 2023)లో నిలిచిన ఆటగాళ్ల జాబితాను ఐసీసీ (ICC) గురువారం విడుదల చేసింది. ఈ అవార్డుకు నలుగురు ఆటగాళ్లను నామినేట్‌ చేయగా.. ఇందులో ముగ్గురు భారత్‌ ఆటగాళ్లే కావడం విశేషం. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli), మహ్మద్‌ షమితోపాటు 2023లో సూపర్‌ఫామ్‌ కనబర్చిన శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కివీస్‌ ఆటగాడు డారిల్ మిచెల్‌ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నాడు. ఈ నలుగురిలో ఒకరు అవార్డును అందుకోనున్నారు.

ఐసీసీ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2023 అవార్డులో రేసులో సూర్యకుమార్ యాదవ్ (భారత్), సికిందర్ రజా (జింబాబ్వే), అల్పేష్‌ రామ్‌జానీ (ఉగాండ), మార్క్‌ చాప్‌మన్‌ (న్యూజిలాండ్) నిలిచారు. సూర్యకుమార్‌ యాదవ్‌ 2022లో టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని