Virat Kohli: బుమ్రా బౌలింగ్‌ అనుకరించిన కోహ్లీ.. ఆటగాళ్ల నవ్వులు

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ పింక్‌ బాల్‌ టెస్టులో ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ శైలిని అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది...

Published : 14 Mar 2022 14:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ పింక్‌ బాల్‌ టెస్టులో ప్రధాన పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రా బౌలింగ్‌ శైలిని అనుకరించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. శనివారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం దిశగా సాగుతోంది. అయితే, మ్యాచ్‌ ప్రారంభమైన తొలిరోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి ముందు దొరికిన విరామ సమయంలో బుమ్రా ఎలా బౌలింగ్‌ చేస్తాడో కోహ్లీ చేసి చూపించాడు. దీంతో అక్కడున్న ఆటగాళ్లంతా సరదాగా నవ్వుకున్నారు.

ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 109 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా స్వదేశంలో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అనంతరం టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 303/9 స్కోర్‌ వద్ద డిక్లేర్డ్‌ చేయగా లంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ బుమ్రా తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఓపెనర్‌ లాహిరు తిరుమాన్నెను(0) డకౌట్‌గా పెవిలియన్‌ పంపాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి ఆ జట్టు 28/1తో నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని